YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

క్షేత్ర సందర్శనం: శ్రీలంక లోని శ్రీ శాంకరీ దేవి ఆలయం ....

క్షేత్ర సందర్శనం: శ్రీలంక లోని శ్రీ శాంకరీ దేవి ఆలయం ....

ఈ ప్రపంచాన్ని శాసించే సర్వసత్తాక శక్తులుగా పేరొందిన శివుడు, విష్ణూవుతో పోటీపడి సర్వ జనులనూ ఆకట్టుకున్న దేవి ఆదిపరాశక్తి. ఆమె దయతోనే త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయ కారకాలను నిర్వహిస్తున్నార ని పురాణాలు చెబుతున్నారుు. నిగ్రహానుగ్రహ సామర్థ్యం గల సర్వశక్తి స్వరూపిణి, సర్వగ్రహ సంచారిణి, లోకానుగ్రహ కారిణి అమ్మవారు. ఆ అమ్మను ఆరాధించేందుకు మనదేశంలో అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నారుు. అష్టాదశ శక్తిపీఠాల్లో వెలసిన అమ్మవారికి ఎనలేని శక్తి ఉంటుందని భక్తుల విశ్వాసం. అరుుతే అందరికీ అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్న శక్తి స్వరూపిణిని దర్శించుకోవడం కుదరకపోవచ్చు.అలాంటప్పుడు అష్టాదశ శక్తిపీఠాల్లో్ల ఏ ఒక్క పీఠాన్ని దర్శించుకున్నా అన్ని శక్తి పీఠాలను దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని పురాణాలు చెబుతున్నారు...
సతీదేవి తండ్రి దక్షుడు మహాయజ్ఙం చేయ తలపెట్టి ముల్లోకాల్లోని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ ఇష్టంలేని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయిన కూతురు, అల్లుడిని ఆహ్వానించడు. దీంతో ఎలాగైనా యజ్ఙానికి వెళ్ళాలని పరమశివుడిని పార్వతీదేవి వేడుకుంటుంది. అయితే పిలవని పేరంటానికి రావడానికి శివుడు ఒప్పుకోడు. దీనిని అవమానంగా భావించిన పార్వతీదేవి ఉగ్రరూపిణిగా ఊగిపోతూ తన శరీరాన్ని 18 ముక్కలు చేసి విసిరి వేస్తుంది. ఆ శరీర భాగాలు భూలోకంలో 18 చోట్ల పడతాయి. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలిశాయని పురాణగాథ. ఈ అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకునే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలను నెరవేర్చే అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాల్లో దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
  శ్రీ శాంకరీ దేవి... ఈ పీఠం శ్రీలంకలో ఉంది. ఇక్కడ అమ్మవారి కాలి గజ్జెలు పడ్డాయి. ఇది అష్టాదశ పీఠాల్లో ప్రథమ పీఠం. రావణుని స్తోత్రాలకు ప్రన్నమైన పార్వతీదేవి లంకలో అవతరించింది. రావణుని సీతాపహరణ దోషం వల్ల ఆ తల్లి అంతర్ధానమైంది. రావణ సంహారానంతరం తిరిగి లంకలో మహర్షులు చేత ప్రతిష్ఠించబడింది. ఇదీ ఈ శక్తి పీఠం యొక్క పురాణగాథ.
శ్రీ శాంకరీ దేవి ఆలయం ,శ్రీలంక తూర్పు ప్రాంతం లోని కోనేశ్వరం లో త్రిముకోమలై వద్ద వుందని చెప్పబడుతుంది . దానినే కొనేశ్వరం శాంకరీదేవి ఆలయంగా కూడా పిలుస్తారు . అయితే ప్రస్తుతం, ఈ ప్రదేశంలో .. ఏ ఆలయం లేకపోయినా, శ్రీ శాంకరీ దేవి ఆలయం ఖచ్చితంగా వున్నదని చెప్పినచోట, అది వున్నట్లు చూపే గుర్తుగా, ఒక స్తూప స్థంబాన్ని కొండ శిఖరం మీద నిర్మిచారు. ఈ ఆలయాన్ని 16 -17 శతాబ్దం మధ్య పోర్చుగీస్ వారు నాశనం చేశారు. చరిత్ర ఆధారంగా 17 వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఈ ద్వీపాన్ని ముట్టడించారు. కొండ శిఖరం పైన వున్న ఈ ఆలయాన్ని వారి ఓడ నుండే ఫిరంగులతో దాడి చేసి పూర్తిగా నాశనం చేశారు.అయితే, శాంకరీ దేవి విగ్రహాన్ని, ఆలయం వున్నదని చూపిన స్థలం ప్రక్కనే, ఇప్పుడు ఉన్న శ్రీ త్రికోనేశ్వర (శివ) స్వామి ఆలయంలో భద్రపరచ బడిందని భక్తుల విశ్వాసం.  ఇటీవల నిర్మాణం చేసిన ఈ ఆలయాన్ని, శాంకరీ దేవి ఆలయంగా కంటే కూడా, స్థానికులు శివాలయం గానే భావిస్తారు. త్రిముకోమలై అంటే “త్రిభుజం ఆకారంలో” వున్న “కొండ” పై ఉండటం వల్ల - ఆ దేవుణ్ణి శ్రీ త్రికోనేశ్వర స్వామిగా పిలుస్తారు. ఆ శివాలాయం ప్రక్కనే... ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు.. ఆ ఆలయంలోని కొలువైవున్న దేవినే శాంకరీ దేవిగా కొలుస్తున్నారు.
ఓం నమః శివాయ

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts