YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

తిరుచానూరులో కేంద్ర మంత్రి

తిరుచానూరులో కేంద్ర మంత్రి

తిరుచానూరులో కేంద్ర మంత్రి
తిరుపతి మార్చి 13,
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంభ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం ఎదుట రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ స్వాగతం పలుకగా ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు.   పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్,టీటీడీ జెఈఓ సదా భార్గవి లతో పాటు బిజెపి నాయకులు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు కేంద్ర మంత్రి కుటుంభ సబ్యులకు దర్శన ఏర్పాట్లు చేశారు.  అమ్మావారి కుంకుమార్చన సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆశీర్వదా మండపంలో వేదపండితుల వేదాశీర్వచనం నిర్వహించగా టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి, అమ్మావారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల బిజెపి నాయకురాలు శాంతా రెడ్డి, నాయకులు గుండాల గోపినాధ్ దుశ్శాలువ తో సత్కరించి, స్వామి అమ్మావారి చిత్ర పటాన్ని అందించారు

Related Posts