YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

 జూన్ 28 నుంచి అమర్ నాధ్ యాత్ర

 జూన్ 28 నుంచి అమర్ నాధ్ యాత్ర

 జూన్ 28 నుంచి అమర్ నాధ్ యాత్ర
న్యూఢిల్లీ, మార్చి 15,
జూన్ 28 నుంచి అమర్‌నాథ్ యాత్ర: ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్.. ఇలా చేసుకోవాలి ప్రారంభం కానుంది. ఈ ఏడాది జరిగే యాత్ర‌లో ఆరు ల‌క్ష‌ల మంది పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.కరోనా వైరస్ నేపథ్యంలో గతేడాది అమర్‌నాథ్ యాత్ర రద్దుకాగా.. ఈ ఏడాది ఉంటుందా? అనే సందిగ్ధతకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తెరదించింది. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూన్ 28న ప్రారంభమవుతుందని అమర్‌నాథ్ దేవస్థానం వెల్లడించింది. జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అధ్యక్షతన శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 28న ప్రారంభమై 56 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 22న రక్షాబంధన్‌తో ముగియనుంది.అమర్‌నాథ్‌ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్‌ 1 న ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంకులకు చెందిన 446 శాఖల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కరోనా కారణంగా గతేడాది కేవలం సాధువులకు మాత్రమే యాత్రకు అనుమతిచ్చారు. అంతకు ముందు 2019లో ఉగ్రదాడి హెచ్చరికల నేపథ్యంలో అర్థాంతరంగా యాత్రను రద్దుచేశారు. అమరనాథ్‌లో శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా సగటున రెండున్నర నుంచి మూడున్నర లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు.ఏడాదిలో కేవలం 45 రోజుల పాటు మాత్రమే కనిపించే మంచు శివలింగ దర్శనం కోసం భక్తులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. ఈ మంచులింగం దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. చుట్టూ ఎత్తయిన కొండల మధ్య లోయల వెంట సాగే ప్రయాణం అత్యంత మనోహరంగా ఉంటుంది. దీంతో పాటు ప్రమాదకరమైంది కూడా. ప్రపంచంలోనే అతి కష్టమైన యాత్రగా దీనికి పేరుంది.వెళ్తున్న కొద్ది ఆక్సీజన్‌ అందనంత ప్రమాదకరమైన వాతావరణం ఉంటుంది. దీంతో పాటు మైనస్‌ డిగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణస్థితిలో ప్రయాణం. వెంట్రుకవాసి నిర్లక్ష్యం చేసినా ప్రాణాలపై ఆశ ఉండదు. దీంతో పాటు అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ యాత్రకు ఏటా భక్తులు పోటెత్తుతారు.

Related Posts