YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

తిరుమలకు మళ్లీ భారీగా ఆదాయం

తిరుమలకు మళ్లీ భారీగా ఆదాయం

తిరుమలకు మళ్లీ భారీగా ఆదాయం
తిరుమల, మార్చి 19,
రుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం వచ్చింది. గురువారం శ్రీవారిని 50,087మంది భక్తులు దర్శించుకున్నారు. 25,466మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు కానుకలతో పాటు నిల్వ ఉన్న నాణేలను గురువారం లెక్కించగా రూ.5.21 కోట్ల ఆదాయం లభించింది. మళ్లీ చాలా రోజుల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం పెరిగింది.. పాత రికార్డ్ బ్రేక్ చేసి ఏకంగా రూ.5కోట్లు దాటింది.కరోనా ప్రభావంతో శ్రీవారి హుండీ ఆదాయం బాగా తగ్గిపోయింది. కరోనా కట్టడి కావడంతో పాటూ పరిస్థితుల్లో మార్పు రావడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది.. హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. టీటీడీ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనంతో పాటూ సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో.. భక్తుల సంఖ్య పెరిగింది.లాక్‌డౌన్ కారణంగా మార్చి 2020లో ఆర్జిత సేవలను నిలిపివేయగా.. ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి ఏప్రిల్ 14 నుంచి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించనునన్నారు. ఆర్జిత సేవలో పాల్గొనాలని భావించే భక్తులు కోవిడ్ నెగటివ్ రిపోర్టును చూపించాల్సి ఉంటుంది. మార్చి 24 నుంచి 28 తేదీల మధ్య తెప్పోత్సవం నిర్వహించనున్నారు

Related Posts