YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కోవీషీల్డ్ టీకాల ధ‌ర‌ల‌ను ప్ర‌క‌టించిన సీరం సంస్థ

కోవీషీల్డ్ టీకాల ధ‌ర‌ల‌ను ప్ర‌క‌టించిన సీరం సంస్థ

పుణె ఏప్రిల్ 21
 కోవీషీల్డ్ ఉత్ప‌త్తి చేస్తున్న సీరం సంస్థ ఇవాళ టీకాల ధ‌ర‌ల‌ను ప్ర‌క‌టించింది. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కోవీషీల్డ్ టీకాల‌ను రూ.400కు ఒక డోసు చొప్పున‌ ఇవ్వ‌నున్న‌ట్లు సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా తెలిపారు. ఇక ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌ల‌కు ఒక డోసు కోవీషీల్డ్ టీకాను రూ.600కు ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. సీరం సంస్థ త‌న ట్విట్ట‌ర్‌లో దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న జారీ చేసింది. వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిని వేగ‌వంతం చేయాలంటూ కేంద్ర ఆరోగ్య‌శాఖ సూచ‌న‌ను సీరం సంస్థ స్వాగ‌తించింది. రాష్ట్ర ప్ర‌భుత్వాలు, వ్యాక్సినేష‌న్ కేంద్రాలు, ప్రైవేటు హాస్పిట‌ళ్లు నేరుగా వ్యాక్సిన్ కోనుగోలు చేసుకునేందుకు వెస‌లుబాటు క‌ల్పిస్తున్న‌ట్లు సీరం సంస్థ చెప్పింది.

Related Posts