YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ట్యాక్స్ పేయర్స్ కు కేంద్రం ఊరట

ట్యాక్స్ పేయర్స్ కు కేంద్రం ఊరట

హైదరాబాద్, ఏప్రిల్ 24, 
మోదీ సర్కార్ పన్ను చెల్లింపుదారులకు తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ట్యాక్స్ పేయర్స్‌కు ఊరట కలిగే ప్రకటన చేసింది. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది.కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ జూన్ 30 వరకు అందుబాటులో ఉండనుంది. పన్ను చెల్లింపుదారులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజనం పొందొచ్చు. సాధారణంగా ఈ స్కీమ్ గడువు ఏప్రిల్ 30తో ముగియాల్సి ఉందిట్యాక్స్ పేయర్స్‌కు పన్ను అంశానికి సంబంధించి ఏమైనా వివాదాలు లేదా పాత బకాయిలు ఉంటే వాటన్నింటినీ ఈ స్కీమ్ కింద సెటిల్‌మెంట్ చేసుకోవచ్చు. ఒకేసారి కొంత పేమెంట్ చెల్లిస్తే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల చాలా మందికి ఊరట కలిగే అవకాశముంది. 

Related Posts