విశాఖపట్నం
మాజీ ఎంపీ, తెదేపా నేత సబ్బం హరి (69) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో అనారోగ్యానికి గురై విశాఖ అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. సబ్బం హరికి కొవిడ్తో పాటు ఇతర ఇన్ఫెక్షన్లు కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సబ్బం హరి స్వస్థలం తగరపువలస సమీపంలోని చిట్టివలస. గతంలో విశాఖ మేయర్గా పని చేశారు. 2009లో కాంగ్రెస్ నుంచి అనకాపల్లి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.