YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్ జూలో సింహాలకు కరోనా ?

హైదరాబాద్ జూలో సింహాలకు కరోనా ?

హైదరాబాద్ మే 4
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి జంతువులకు సోకుతుందా? మనుషులే కాదు.. జంతువులనూ కరోనా వదలడం లేదు. హైదరాబాద్ జూలో సింహాలకు కరోనా వచ్చింది.దేశంలో తొలిసారి జంతువులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం . నెహ్రూ జూ పార్క్ లోని ఎనిమిది ఆసియా సింహాలకు పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.. అయితే ఆ సింహాల్లో వైరస్ లక్షణాలు లేవంటున్న జూ నిర్వాహకులు చెబుతున్నారు.సింహాల ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం కరోనా సోకిన ఎనిమిది సింహాలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాయి. ఇంతకీ కరోనా ఎవరి ద్వారా ఎలా సింహాలకు వ్యాపించి ఉంటుంది? అనేది ప్రశ్నార్థకంగా మారింది.మనుషుల నుంచి జంతువులకు వైరస్ సోకుతుందనడానికి కచ్చితమైన ఆధారాలేమి లేవు. ఈ పరిస్థితుల్లో సింహాలకు వైరస్ సోకడంతో అధికారులు వాటి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు.

Related Posts