YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

జియో రిపబ్లిక్‌ డే ఆఫర్‌

 జియో రిపబ్లిక్‌ డే ఆఫర్‌

సందర్భంగా జియో మరోసారి ప్లాన్లను సవరించింది. నూతన సంవత్సరం 2018 సందర్భంగా ప్లాన్లను సవరించిన జియో.. 50 శాతం అదనపు డేటాను అందిస్తోంది. రూ. 98 రీచార్జ్ ప్యాక్‌ను సవరించి కొత్త ప్లాన్‌తో అదనపు డేటాను అందిస్తోంది. ఈ ఆఫర్‌ ద్వారా రూ.98 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, 2జీబీ డేటాను 28రోజుల కాలపరిమితిపై అందిస్తోంది. అలాగే రోజు 1జీబీ డేటాను అందించే అఫర్లలో కూడా ప్రస్తుతం రోజుకు 1జీబీ డేటా ప్లాన్‌ను 1.5జీబీగా సవరించింది. రోజుకు 1.5జీబీ అందించే ప్యాక్‌లను 2జీబీగా సవరించి అదనంగా అందిస్తోంది.

రిపబ్లిక్ డే సందర్భంగా జియో ఆఫరల్లో రూ.149 ప్లాన్‌లో 42జీబీ (28రోజుల కాలపరిమితి), రూ. 349 ప్లాన్‌లో 105జీబీ (70రోజల కాలపరిమితి), రూ.399 ప్లాన్‌లో 126జీబీ (84రోజుల కాలపరిమితి), రూ.449 ప్లాన్లలో 136జీబీ (91రోజుల కాలపరిమితి) డేటా చొప్పున అందిస్తోంది. రూ.198 ప్లాన్‌లో (56జీబీతో 28రోజుల కాలపరిమితి), రూ.398 ప్లాన్‌లో (140జీబీతో 70రోజలు), రూ.448 ప్యాక్‌లో (168జీబీతో 84రోజులు), రూ.498 ప్లాన్‌లో 18జీబీతో 91రోజుల కాలపరిమితిపై అందిస్తోంది. వరుసగా రోజుకు 2జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్లన్నీ రిపబ్లిక్ డే జనవరి 26 (శుక్రవారం) నుంచి అందుబాటులోకి వస్తాయి. రూ.400 విలువ గల వోచర్లపై రూ. 398 రీచార్జ్‌తో 100శాతం క్యాష్‌బ్యాక్‌‌ను జియో అందిస్తోంది. 

Related Posts