YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

మార్కెట్లోకి తెలంగాణ యాపిల్

మార్కెట్లోకి తెలంగాణ యాపిల్

అదిలాబాద్, మే 14,
యాపిల్ పేరు చెప్పగానే కశ్మీర్, సిమ్లా గుర్తుకువస్తాయి. అక్కడ సాగయ్యే యాపిల్ పండ్లు దేశమంతా సప్లయ్ అవుతాయి. ఒక్కోసారి యాపిల్ చాలా చౌకగా లభిస్తుంది. తెలంగాణ జిల్లాలోనూ యాపిల్ సాగు చేస్తున్నారు. రైతులు ఆసిఫాబాద్ జిల్లా లో ఆపిల్ సాగు చేసి చూపించారు. ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లా అడవుల్లో ఆపిల్  సాగు విజయవంతం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతు బాలాజీ  వ్యవసాయ క్షేత్రంలో  రెండెకరాల్లో ఏపుగా పెరిగిన 400 యాపిల్ మొక్కలు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కోచెట్టుకు 40 వరకు కాయలు కాచాయి. మరో నెలలో మార్కెట్లోకి రానున్నాయి తెలంగాణ యాపిల్స్. తెలంగాణ అనగానే ఠక్కున గుర్తొచ్చే బతుకమ్మ, బోనాలు, బిర్యానీ పక్కన కొత్తగా యాపిల్‌ పండు చేరింది. కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లోని కెరమెరి అటవీప్రాంతంలో తెలంగాణ యాపిల్‌ నెలరోజుల్లో కోతకు రానున్నది! ఏడాదిలో ఎక్కువకాలం కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ ప్రాంతం యాపిల్‌సాగుకు అనుకూలంగా ఉంది. ఔత్సాహిక రైతు బాలాజీ ప్రయోగాత్మకంగా చేసిన యాపిల్‌సాగు విజయవంతం అయింది. చల్లని ప్రదేశాల్లో కొత్తరకం సాగుకు ఈ ప్రయత్నం దారిచూపింది. ఆదివాసి ప్రాంతంలో మారుమూల అటవీ ప్రాంతంలో ఆపిల్ సాగు చేస్తున్న రైతు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా మన యాపిల్‌ మార్కెట్‌లోకి రానుంది. త్వరలో ఈ ఫలాల రుచిని ఆస్వాదించే అవకాశముంది. సర్కారు సహకారంతో కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం ధనోరాకు చెందిన రైతు కేంద్రె బాలాజీ 400 మొక్కలు నాటగా, మరో నెలరోజుల్లో పంట చేతికందనుంది. మొదటల్లో బాలాజీ 15 ఎకరాల్లో పత్తి తదితర వాణిజ్యపంటలు వేయగా నష్టాలు వచ్చాయి. దీంతో పెట్టుబడి తక్కువగా ఉండే ఆహార పంటలు సాగుచేయాలని నిర్ణయించుకున్నాడు. మార్కెట్లోకి పండ్లు కొనడానికి వెళ్ళినప్పుడు నిగనిగ లాడే ఆపిల్ పండ్లను చూసి ఆపిల్ సాగును స్వయంగా ఎందుకు సాగు చేయకూడదు కాశ్మీర్ ఆపిల్ కు ధీటుగా పండించి మన రాష్ట్రానికి ఆపిల్ అందించాలని ఒక గట్టి సంకల్పంతో తన ఆలోచన తన స్నేహితుడికి చెప్పి స్నేహితుడి సలహాతో రాజమండ్రిలోని కడియం నర్సరీ నుంచి బాలాజీ పది యాపిల్‌ మొక్కలు తీసుకొచ్చి నాటాడు. తనకున్న పరిజ్ఞానంతో వాటికి అనుకూలమైన వాతావరణం కల్పించగా ఏపుగా పెరిగాయి. ఉష్ణ మండల ప్రాంతాల్లో యాపిల్‌ సాగుపై పరిశోధన చేస్తున్న హైదరాబాద్‌లోని సీసీఎంబీ శాస్త్రవేత్తలకు ఈ విషయం తెలిసింది. బాలాజీ యాపిల్‌సాగు చేస్తున్న భూమిని అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేశాడు. 2014లో ఈ భూమిలో సాగుకు అనుకూలమైన హరిమన్‌ రకానికి చెదిన 150 మొక్కలను ఇచ్చి ప్రోత్సహించారు. వారి సలహాలతో మొక్కల చుట్టూ ఏడాది పొడవునా తేమ ఉండేలా ఏర్పాట్లుచేశాడు. 50 మొక్కలు చనిపోగా 100 మొక్కలు పెరిగాయి. రెండో ఏట పూతవచ్చి కాయలు కాశాయి. 2016లో వ్యవసాయశాఖ మరో 300 మొక్కలు ఇవ్వగా నాటాడు. మూడేండ్లుగా పూత,కాతా దశలో తుంచేస్తు కాయలను కోయకుండా చెట్టుకు అలాగే వదిలేశాడు. ప్రస్తుతం కాయలు 200 గ్రాముల పరిమాణానికి చేరాయి. ఇవి ఎర్రగా కశ్మీర్‌ యాపిల్‌ను తలపిస్తున్నాయి. రెండెకరాల్లో 400 చెట్లలో ఒక్కోదానికి 20 నుంచి వరకు 40 కాయలున్నాయి. మరో నెలలో కోతకు వచ్చేసరికి ఒక్కొక్కటి 250 గ్రాముల బరువు వచ్చే అవకాశం ఉన్నది. ఒక్కో చెట్టుకు నాలుగు నుంచి ఆరు కిలోల వరకు దిగుబడి వస్తుందని బాలాజీ తెలిపారు. ధనోరా పరిసరాల్లో సాగవుతున్న యాపిల్‌ క్షేత్రం చుట్టూ గుట్టలు ఉన్నాయి. నవంబర్‌, డిసెంబర్‌ నెలలో ఈ ప్రాంతంలో 4 డిగ్రీ ల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం వల్ల యాపిల్‌ సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు తెలిపారు. సరైన ఊష్ణోగ్రత నమోదవడంతో చెట్టుకు పూత నిలిచి ఉంటుంది. ఆ తర్వాత ఉష్ణోగ్రత పెరిగనా యాపిల్‌ మొక్క తట్టుకుంటుంది. ఒక్కసారి నాటిన యాపిల్‌ మొక్కలు, నేల స్వభావాన్ని బట్టి 25 నుంచి 30 ఏండ్ల వరకు బతికి ఉంటాయి.మొదట్లో తాను నాటిన యాపిల్‌ మొక్కలు బాగా పెరిగాయని ఇక్కడి అధికారులు హైదరాబాద్‌లో ఉండే శాస్త్రవేత్తలకు చెప్పారు. వాళ్లు వచ్చి భూమిని పరిశీలించి తగిన సలహాలిచ్చారని రైతు బాలాజీ తెలిపారు. సర్కారు ఉచితంగా మొక్కలు ఇచ్చిందని, శాస్త్రవేత్తలు,అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేశారని, వారి సహకారం మరువలేనిదని బాలాజీ చెప్పారు. ప్రస్తుతం 400 యాపిల్‌ చెట్లకు కాయలు కాశాయి. ఈ నెలాఖరులోగా కోతకు వచ్చే అవకాశం ఉంది ఈ ఆపిల్ పండ్లను చూసి తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయన్నారు.  మొదటిసారి కోతకోశాక ఆయాపిల్ పండ్లను ముఖ్యమంత్రి కేసీయార్ కు అందిస్తానన్నాడు బాలాజీ. తెలంగాణ యాపిల్ రుచి ఎలా వుంటుందో చూడాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Related Posts