YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరోనాను ఎందుకు ఆరోగ్యశ్రీలో చేర్చడంలేదు ఎంపీ కోమటిరెడ్డి

కరోనాను ఎందుకు ఆరోగ్యశ్రీలో చేర్చడంలేదు ఎంపీ కోమటిరెడ్డి

హైదరాబాద్
కేసీఆర్ నీకు మానవత్వం ఉందా. కరోన ను ఆరోగ్య శ్రీ లో చేర్చుతాను అని అసంబ్లీ సాక్షిగా చెప్పావు కాదా ఏమయింది కేసీఆర్ అని ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఎందుకు కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే అధికారం నీకు ఎవరు ఇచ్చారు కేసీఆర్ అని అడిగారు.
కరోనా తో ప్రజలు పిట్టల రాలుతుంటే ని కంటికి కన్పించడం లేదా. కరోన టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్  బాధ్యతలు ని కొడుకు కేటీఆర్ కు అప్పగించావు. కరోనా ను ఆరోగ్య శ్రీలో ఎప్పుడు చేర్చుతారని కేటీఆర్ ను ప్రజలు ట్విట్టర్ వేదిక గా నిలదీస్తున్నారు. మీ కొడుకు కేటీఆర్ ...ని దృష్టికి తీసుకవస్తాను అని చెప్పారు. మీ దృష్టి కి ...మీ కొడుకు కేటీఆర్ తీసుకవచ్చారా లేదా కేసీఆర్ అని ప్రశ్నించారు.
ఎప్పుడు ఆరోగ్య శ్రీ లో చేర్చుతారు. రాష్ట్రంలో అయ్యా...కొడుకుల డ్రామాలు ఆపండి. కుటుంబ పాలనకు స్వస్తి పలికి ప్రజల కోసం ఆలోచించండి. కరోనా  నుండి ప్రజలను కాపాడండి. కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చకపోతే అయ్యా కొడుకులను చరిత్ర క్షమించదు. కరోనా తో అల్లాడుతున్న వారికి ఉచిత వైద్యం అందించకపోతే అధికారంలో ఉండి ఏమి ఉద్ధరిస్తావు కేసీఆర్. ప్రజలను కాపాడలేకపోతే ఎందుకు నీకు ఈ ముఖ్యమంత్రి పదవి. కరోనా ను ఆరోగ్య శ్రీలో చేర్చకపోతే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడనికి నీకు అర్హుతా లేదు కేసీఆర్ అని మండిపడ్డారు.
నువ్వు పాలన సాగించేది ప్రజల కోసమా...నీ కుటుంబం కోసమా. కేసీఆర్... ని పాలన చూసి తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుంది. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని అన్నారు.
కేసీఆర్ కు ప్రజల ఉసురు తగులుతుంది. సీఎం కేసీఆర్ కరోన ను ఆరోగ్య శ్రీ లో చేరుస్తానని చెప్పాడు కదా... మరి టి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు,మంత్రులు ఎం చేస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతుంది మీకు కన్పించడం లేదా. టి ఆర్ ఎస్ ఎమ్మెల్యే లు,మంత్రులు ఏమి చేస్తున్నారు గుడ్డి గుర్రాల పళ్ళు తొమ్ముతున్నారా అని నిలదీసారు.
ప్రజల ఓట్ల వేస్తేనే కాదా మీరు గెలిచింది... మరి ప్రజలు కరోనతో పోరాటం చేస్తుంటే మీ ముఖ్యమంత్రి ని ఎందుకు నిలదియడం లేదు. ఎందుకు ఆరోగ్య శ్రీ లో చేర్చండి అని డిమాండ్ చేయడం లేదు. కేసీఆర్ కు ఎన్ని రోజులు భజన చేస్తారు...ప్రజల గోస మీకు పట్టదా. మీ ప్రభుత్వ నిర్వహం వల్ల మెరుగైన వైద్యం చేయించుకోక ఇంకా ఎంత మంది పేద ప్రజల ప్రాణలు పోవాలని ప్రశ్నించారు.
కరోనా తో చనిపోతున్న వారివి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే . కార్పోరేట్ హాస్పిటల్ లో లక్షలు లక్షలు పెట్టి వైద్యం చేయించుకొనే స్తోమత లేకనే చనిపోతున్నారు. కరోన ను ఆరోగ్య శ్రీ లో చేర్చకపోతే టి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలను,మంత్రులను ప్రజలు ఉరికించి ఉరికించి కోడుతారు. కేసీఆర్ ఇకనైనా కండ్లు తెరవండి. వెంటనే కరోన ను ఆరోగ్య శ్రీ లో చేర్చండని అయన అన్నారు.

Related Posts