YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

వరుస చోరీలు సీసీ కెమెరాలు సైతం ధ్వంసం

వరుస చోరీలు సీసీ కెమెరాలు సైతం ధ్వంసం

మేడ్చల్
దుండిగల్   పి.యస్ పరిధిలో దొంగలు వరుసగా ఐదే ఇళ్ళలో  దొంగతనాలు చేసి, తమ ఆనవాళ్ళు దొరక కుండా ఉండేదుకు సి.సి కెమెరాలు సైతం ద్వంసం చేసారు.
మేడ్చల్ జిల్లా దుండిగల్ పిఎస్ పరిధి సార్ గూడెం గ్రామంలో వరుస ఇళ్లల్లో చోరీ స్థానికంగా కలకలం రేపుతోంది. ఐదుగురు సభ్యుల ముఠా అర్ధరాత్రి 12 గంటల సమయంలో సారె గూడెం ఊర్లోకి ప్రవేశించి  ఐదు ఇళ్లలో చోరీలకు పాల్పడగా మూడు ఇళ్లలో నగలు నగదు మాయమయ్యాయి. బాలమణి అనే వృద్ధురాలు నిద్రిస్తున్న సమయంలో ఆమె మెడలో ఉన్న 3.25 తులాల బంగారు గోలుసును దొంగిలించారు దుండగులు. పక్కనే ఉన్న మరో వ్యక్తి మహేష్ ఇంట్లో నాలుగు వేల రూపాయలు రెండు ఫోన్లు దొంగిలించగా..సురేష్ ఇంట్లో 11 వేలు దొంగిలించారు. సంతోష్ అనే వ్యక్తి ఇంట్లో మూడు గదులను పగలగొట్టగా ఏమి దొరకకపోవడంతో ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ లను గమనించిన దుండగులు రెండు కెమెరాలను ధ్వంసం చేశారు.  ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు ప్రవేశించిన  దృశ్యాలు సీసీటివిలో నమోదయ్యాయి.

Related Posts