YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

స్టీల్ ప్లాంట్ పై అసెంబ్లీలో తీర్మానం ప్రజా సంఘాల హర్షం

స్టీల్ ప్లాంట్ పై  అసెంబ్లీలో తీర్మానం ప్రజా సంఘాల హర్షం

విశాఖపట్నం
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ప్రకటనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం ప్రవేశపెట్టడం పై విశాఖ లో ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తు న్నామని విశాఖలో పొలిటికల్ జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ మేరకు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పొలిటికల్ జేఏసీ నేతలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలో స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని జేఏసీ నేత జేటి రామారావు డిమాండ్ చేశారు.

Related Posts