YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఓ వైపు ఫిర్యాదులు..మరో వైపు లేఖలు

ఓ వైపు ఫిర్యాదులు..మరో వైపు లేఖలు

న్యూఢిల్లీ, జూన్ 10,
వైసీపీకి కంటిలో నలుసులా తయారైన సొంత పార్టీ ఎంపీ రఘు రామకృష్ణ రాజు మరో సంచలనానికి తెరలేపారు. ఇప్పటికే పరిస్థితి ఉప్పూనిప్పులా ఉంటే.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ సీఎం జగన్‌ని టార్గెట్ చేస్తూ లేఖ రాయడం సంచలనంగా మారిందిరాజద్రోహం కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన వైసీపీ రెబల్ ఎంపీరఘు రామకృష్ణ రాజు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మరోమారు నేరుగా సీఎం జగన్‌కి లేఖ రాసి ఆసక్తి రేపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరుతూ లేఖ సీఎం జగన్‌కి రఘురామ లేఖ రాయడం చర్చనీయాంశం మారింది. సొంత పార్టీ ఎంపీ అయి ఉండి ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న రఘురామ పింఛన్ల వ్యవహారంలో ముఖ్యమంత్రికి లేఖ రాశారు.వృద్ధాప్య పింఛన్లను తక్షణమే పెంచాలని.. ఈ నెల నుంచి రూ.2,750 చెల్లించాలని రఘురామ కోరారు. పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇప్పటికైనా ఆ హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. అలాగే ఇప్పటి వరకూ పెండింగ్‌ పడిన అదనపు పింఛన్ సొమ్ము రూ.3 వేలు కూడా లబ్ధదారులకు అందజేయాలని ఆయన సూచించారు.ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామ తనను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి.. తీవ్రంగా హింసించారని కేంద్ర మంత్రులు, ఎన్‌హెచ్చార్సీ, లోక్ సభ స్పీకర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. జగన్ సర్కార్ వైఫల్యాలను ప్రశ్నించినందుకే తనను ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఢిల్లీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో హామీలు నిలబెట్టుకోవాలంటూ రఘురామ లేఖ సీఎం జగన్‌కి లేఖ రాయడం ఆసక్తి రేపుతోంది.

Related Posts