YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నాపై అనర్హత వేటు సాధ్యం కాదు: రఘురామకృష్ణంరాజు

నాపై అనర్హత వేటు సాధ్యం కాదు: రఘురామకృష్ణంరాజు

న్యూ ఢిల్లీ జూన్ 12
తనపై అనర్హత వేటు సాధ్యం కాదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఢిల్లీలో ఇటీవల ఎంపీ రఘురామ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని.. ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఇక సీఎం జగన్ ఢిల్లీలో ఉండడంతో ఆయన కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది.ఈ పరిణామాలపై తనను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీల తీరుపై రఘురామకృష్ణంరాజు  స్పందించారు తనపై అనర్హత వేటు సాధ్యం కాదని.. పార్టీకి విరుద్ధంగా వ్యవహరించలేదని రఘురామ క్లారిటీ ఇచ్చారు. ఏ పార్టీతోనూ జత కట్టలేదని.. పథకాల అమలులో లోపాలను మాత్రమే ప్రస్తావించానని చెప్పారు. కొంత మంది తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశానని.. వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయని రఘురామ వివరణ ఇచ్చారు.

Related Posts