YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరుల మృతి

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరుల మృతి

న్యూ ఢిల్లీ  జూన్ 12
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌ పట్టణంలో శనివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, మరో ఇద్దరు పౌరులు మరణించారు. మరో ఇద్దరు పోలీసులు, ఓ పౌరుడికి గాయాలైనట్లు సమాచారం. ఉత్తర కాశ్మీర్‌లోని సోపూర్‌లోని అరంపోరా ప్రాంతంలో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సంయుక్త బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. అయితే, దాడి వెనుక పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Related Posts