YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

పొంచి ఉన్న మూడో వేవ్ ముప్పు: ఎస్‌బీఐ తాజా స‌ర్వే నివేదిక‌

 పొంచి ఉన్న మూడో వేవ్ ముప్పు: ఎస్‌బీఐ తాజా స‌ర్వే నివేదిక‌

న్యూ ఢిల్లీ జూలై 5
క‌రోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే ముగుస్తోంది. అయితే అప్పుడే మూడో వేవ్ ముప్పు పొంచి ఉంద‌ని చెబుతోంది ఎస్‌బీఐ తాజా స‌ర్వే. ఆగ‌స్ట్‌లోనే ఈ మూడో వేవ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని త‌న తాజా నివేదిక‌లో హెచ్చ‌రించింది. కొవిడ్‌-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరుతో ఎస్‌బీఐ త‌న ప‌రిశోధ‌న నివేదిక‌ను రూపొందించింది. ఇక కొవిడ్ థ‌ర్డ్ వేవ్ పీక్ సెప్టెంబ‌ర్‌లో ఉంటుంద‌నీ ఈ అధ్య‌య‌నం అంచ‌నా వేసింది. ఇండియాలో సెకండ్ వేవ్ పీక్ మే 7వ తేదీన న‌మోదైంద‌ని ఈ నివేదిక వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం డేటా ప్ర‌కారం చూసుకుంటే ఇండియాలో జులై రెండో వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు న‌మోదు కావ‌చ్చు. అయితే ఆగ‌స్ట్ రెండో ప‌క్షంలో కేసుల సంఖ్య మ‌ళ్లీ భారీగా పెర‌గొచ్చ‌ని ఎస్‌బీఐ రిపోర్ట్ అంచ‌నా వేసింది.
రిపోర్ట్‌లోని ముఖ్యాంశాలు
• క‌రోనా థ‌ర్డ్ వేవ్ స‌గ‌టు పీక్ స్టేజీ కేసులు రెండో వేవ్ పీక్ స్టేజీలో న‌మోదైన కేసుల కంటే 1.7 రెట్లు ఎక్కువ‌గా ఉండ‌నున్న‌ట్లు గ్లోబ‌ల్ డేటా చెబుతోంది.
• ఆగ‌స్ట్ రెండో పక్షంలో కేసుల సంఖ్య క్ర‌మంగా పెర‌గ‌డం ప్రారంభ‌మై.. నెల‌లోపు పీక్ స్టేజీకి వెళ్లే చాన్స్ ఉంది.
• ఇక వ్యాక్సినేష‌న్ల విష‌యానికి వ‌స్తే.. దేశంలో స‌గ‌టున రోజుకు 40 వ్యాక్సిన్లు ఇస్తున్నారు.
• దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు 4.6 శాతం కాగా.. 20.8 శాతం మంది తొలి డోసు వేసుకున్నారు.

Related Posts