YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కోవిడ్ ముప్పు ఇంకా తగ్గలేదు

కోవిడ్ ముప్పు ఇంకా తగ్గలేదు

కోవిడ్ ముప్పు ఇంకా తగ్గలేదు
హైదరాబాద్, జూలై 10
కరోనా భావం తగ్గిపోయిందనుకోవడం పొరపాటే అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. వైరస్ ప్రభావం ఏ మాత్రం తగ్గలేదని.. దీన్ని దృఢపరిచే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరగడానికి డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి, మందకొడిగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కారణమని తెలిపారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, అవసరమైనప్పుడు మాత్రమే ఇళ్లలో నుంచి బయటకు రావాలని సూచించారు.బ్లూమ్‌బర్గ్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్యా స్వామినాథన్ మాట్లాడుతూ.. ‘కరోనా రక్కసి కోరలు చాస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. డబ్ల్యూహెచ్‌వో ఆరు రీజియన్లలో ఐదింటిలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి.. గడచిన రెండు వారాల్లో ఆఫ్రికాలో కరోనా మరణాల 30 నుంచి 40 శాతానికి పెరిగాయి.. గత 24 గంటల్లో 5 లక్షల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.అలాగే వైరస్ బారిన పడి 9,300 మంది మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి క్షీణించడం మొదలైందని ఎలా అంటాం? డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం, భౌతికదూరాన్ని పాటించకపోవడం, లాక్‌డౌన్ ఆంక్షలు తొలగించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటం వల్ల కరోనా మళ్లీ విజృంభిస్తోంది’ అని సౌమ్యా స్వామినాథన్ పేర్కొన్నారు.పలు దేశాలు ఆంక్షలు సడలింపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఉండాలని, లాక్‌డౌన్ ప్రయోజనాలను నష్టపోకుండా చూసుకోవాలని ఆమె కోరారు. యూకేలో జూలై 19 నుంచి ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని భావిస్తుండగా.. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించడం వంటి కోవిడ్ నిబంధనలు వ్యక్తిగత ఎంపికగా మారతాయి. కేసులు తగ్గడంతో అమెరికా, ఐరోపాలో చాలా భాగం ఆంక్షలను ఎత్తివేశారుప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉన్నారని, సాధారణ స్థితికి చేరుకున్నామనే ఆలోచన ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే అది చాలా ప్రమాదకరమైంది’ అని వ్యాఖ్యానించారు.

Related Posts