YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రోజుకో మలుపు తిరుగుతున్న రఘురామరాజు కేసు

రోజుకో మలుపు తిరుగుతున్న రఘురామరాజు కేసు

రోజుకో మలుపు తిరుగుతున్న రఘురామరాజు కేసు
హైదరాబాద్, జూలై 20,
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కథ రోజుకు మలుపు తిరుగుతోంది. సుప్రీంకోర్టుకు ఏపీ సీఐడీ సమర్పించిన కీలక ఆధారాలు ఇప్పుడు రాజకీయంగా కాక రేపుతున్నాయి. ఎంపీ రఘురామను మే నెలలో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. తాము దర్యాప్తులో భాగంగా రఘురామ సెల్‌ఫోన్‌ కాల్‌డేటాను విశ్లేషించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని సీఐడీ తెలిపింది. ఇదే అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టుకు ఇటీవల సమర్పించిన అఫిడవిట్‌లో సీఐడీ అధికారులు నివేదించారు. ఈ మేరకు 230 పేజీల అఫిడవిట్‌ అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించారు.ఈ వాట్సాప్‌ ఛాటింగ్‌లో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు...చంద్రబాబు, లోకేశ్, టీడీపీ అనుకూల మీడియా ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి, టీవీ5తో సంభాషణలు సాగించినట్లు సీఐడీ అధికారులు తమ నివేదికలో పేర్కొంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ వ్యవహారంలో చంద్రబాబు స్వయంగా రఘురామ కృష్ణరాజుతో వాట్సాప్‌లో చాటింగ్‌ చేశారని అందులో పేర్కొంది. అలాగే క్రిస్టియన్, రెడ్డి సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని రఘురామ కృష్ణరాజు, చంద్రబాబు, లోకేశ్, ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి, టీవీ 5లతో కలసి కుట్రలకు పాల్పడినట్లు సీఐడీ పేర్కొన్నట్లుగా సమాచారం. ఏబీఎన్‌ ఛానల్‌ ఓ అడుగు ముందుకేసి రఘురామ కోసం రచ్చబండ పేరుతో ఏకంగా ఓ కార్యక్రమాన్నే రూపొందించిందని తెలిపింది.వైఎస్ జగన్ సీఐడీ దర్యాప్తులో భాగంగా రఘురామరాజు వివిధ సందర్భాల్లో మాట్లాడిన 45 వీడియోలను అధికారులు విశ్లేషించారు. ఫోరెన్సిక్‌ ల్యాబరేటరీలకు పంపించి నివేదిక తెప్పించుకున్నారు. చంద్రబాబు, లోకేశ్, ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి, టీవీ 5 యాజమాన్యాలు, ఆ సంస్థ ప్రతినిధులతో జరిపిన వేలాది చాటింగ్‌లను నిశితంగా పరిశీలించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో లోకేశ్, టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులతో చర్చించి పక్కాగా కుట్రపన్ని రఘురామకృష్ణరాజు వ్యవహరించారని సీఐడీ అధికారులు నిర్ధారించారు. చంద్రబాబు డైరెక్షన్లో రఘురామకృష్ణరాజు, ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి, టీవీ 5 యాజమాన్యాలు ఆరు విధాలుగా క్రిమినల్‌ కుట్రలకు పాల్పడ్డారని సీఐడీ అధికారులు నిర్ధారిస్తూ అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు సమాచారం.
రఘురామకృష్ణరాజు: సార్‌... జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ ఇది. అన్ని పాయింట్లూ కవర్‌ చేశా. (ఆ పిటిషన్‌ కాపీని వాట్సాప్‌ చేశారు)
చంద్రబాబు: నాకు లేటెస్ట్‌ వెర్షన్‌ను మళ్లీ పంపించగలవా?
రఘురామకృష్ణరాజు: సారీ సార్‌... ఇప్పుడే పంపిస్తా. (ఆ వెంటనే పిటిషన్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ను పంపించారు)
2021 ఏప్రిల్‌ 4న చంద్రబాబు, రఘురామ కృష్ణరాజు మధ్య ఈ విధంగా వాట్సాప్‌ ఛాటింగ్ జరిగినట్లు సీఐడీ తన అఫిడవిట్లో పేర్కొంది.టీవీ5 ఛానల్‌ యజమాని బీఆర్‌ నాయుడు, రఘురామకృష్ణరాజులకు మధ్య డబ్బు బదిలీ జరిగిందని సీఐడీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. దాదాపు రూ.8.81 కోట్లు (1 మిలియన్‌ యూరోలు) టీవీ 5 బీఆర్‌ నాయుడు నుంచి రఘురామ కృష్ణరాజుకు బదిలీ అయ్యాయని సీఐడీ తెలిపింది. ఏ కంపెనీ పేరు మీద, ఏ బ్యాంకులో ఆ డబ్బు జమ అయిందో కూడా సీఐడీ ఆధారాలతో సహా సుప్రీం కోర్టుకు నివేదించింది. చంద్రబాబు డైరెక్షన్‌లో రఘురామరాజు, ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి, టీవీ 5 యాజమాన్యాలు ఆరు విధాలుగా క్రిమినల్‌ కుట్రలకు పాల్పడ్డారని సీఐడీ అధికారులు నిర్ధారిస్తూ అఫిడవిట్‌లో పేర్కొన్నారు

Related Posts