YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు విదేశీయం

పుంజుకున్న మహిళా హాకీ టీమ్

పుంజుకున్న మహిళా హాకీ టీమ్

పుంజుకున్న మహిళా హాకీ టీమ్
టోక్యో, 
టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ టీమ్ పుంజుకుంది. వందన కతారియా హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో దక్షిణాఫ్రికాపై 4-3 తేడాతో గెలిచిన భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ ప్లేయర్ ఇలా హ్యాట్రిక్ గోల్స్ కొట్టడం ఇదే తొలిసారి. ఈరోజు సాయంత్రం బ్రిటన్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌‌ డ్రాగా ముగిసినా లేదా ఐర్లాండ్ ఓడినా భారత్ మహిళల జట్టు‌కి క్వార్టర్‌ ఫైనల్ బెర్తు ఖరారుకానుంది. ఒకవేళ ఐర్లాండ్ గెలిస్తే..? అప్పుడు భారత్ జట్టు నిష్క్రమిస్తుంది.మ్యాచ్‌ నాలుగో నిమిషంలోనే గోల్ కొట్టిన వందన భారత్‌‌ని 1-0తో ఆధిక్యంలో నిలిపింది. కానీ.. 30 సెకన్ల వ్యవధిలోనే గ్లాబ్సీ గోల్‌ కొట్టి భారత్ ఆధిక్యాన్ని 1-1కి తగ్గించింది. కానీ.. ఆ తర్వాత 17 నిమిషంలో వందన గోల్స్ చేయగా.. దక్షిణాఫ్రికా నుంచి కూడా 30, 39వ నిమిషాల్లో గోల్స్ వచ్చాయి. మధ్యలో నేహా గోయల్ కూడా 32వ నిమిషంలో గోల్ చేసింది. మొత్తంగా.. 3-3తో మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతున్న సమయంలో వందన మరోసారి 49వ నిమిషంలో గోల్ చేసి భారత్‌ని 4-3తో ఆధిక్యంలో నిలిపింది. ఇక అక్కడ నుంచి ఒత్తిడిలోకి వెళ్లిన దక్షిణాఫ్రికా టీమ్ చివరి వరకూ గోల్ కోసం శతవిధాల ప్రయత్నించినా లాభం లేకపోయింది.

Related Posts