YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

టోక్యో ఒలింపిక్స్ లో అమ్మాయిలు.. అధరహో....

టోక్యో ఒలింపిక్స్ లో అమ్మాయిలు.. అధరహో....

 టోక్యో ఒలింపిక్స్ లో అమ్మాయిలు.. అధరహో....
టోక్యో, ఆగస్టు 2,
 టోక్యో ఒలింపిక్స్ లో నిన్న మెన్స్ హాకీ జట్టు చరిత్ర సృష్టించగా  భారత మహిళా జట్టు వంతు వచ్చింది.  ఆస్ట్రేలియా జట్టుపై 1-0 తేడాతో గెలిచి.. భారత జట్టు.. సగర్వంగా సెమీస్‌లో అడుగు పెట్టింది. సుదీర్ఘ విరామం తర్వాత హాకీ జట్టు సెమీస్ చేరుకుంది. పతకం సాధించాలనే పట్టుదలతో  క్వార్టర్ ఫైనల్ లో మూడు సార్లు ఒలింపిక్స్ విజేతలైన ఆస్ట్రేలియా జట్టుపై మన అమ్మాయిలు పూర్తి ఆధిపత్యాన్ని సాగించారు.  మైదానమంతా పాదరసంగా కదులుతూ మన అమ్మాయిలు  వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. భారత్ నుంచి గుర్జీత్‌ కౌర్‌… గోల్‌ చేసి భారత్‌కు తొలి పాయింట్‌ అందించింది.దీంతో టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది.సెమీ ఫైనల్ కు చేరుకుంది. ఒలింపిక్స్ లో తొలిసారిగా విమెన్స్ ఒలింపిక్ ఫీల్డ్ హాకీ పోటీలను 1980లోనిర్వహించింది. అప్పుడు ఒలింపిక్స్ మాస్కోలో జరిగాయి. ఒలింపిక్స్ లో విమేన్ హాకీ ని ప్రవేశ పెట్టిన 36 ఏళ్ల తరువాత తొలిసారిగా 2016 లో రియో ఒలింపిక్స్ లో భారత మహిళా జట్టు పాల్గొంది. అయితే అప్పుడు గ్రూప్ స్టేజ్ లో ఎలిమినేటి అయ్యింది. అయితే ఈసారి టోక్యో ఒలింపిక్స్ లో మాత్రం మన అమ్మాయిలు.. తడబడుతూ మొదలు పెట్టిన జర్నీని .. విజయం దిశగా తీసుకునివెళ్ళారు. చరిత్ర సృష్టించారు.
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ మహిళల ప్రయాణం తడబడుతూ మొదలైంది. గ్రూప్-ఏలో మొత్తం 5 మ్యాచ్ లు ఆడిన భారత్ 2 మ్యాచ్ లలో గెలిచి, 3 మ్యాచ్ లలో ఓటమిపాలైంది. పతకం రేసు లో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో మన అమ్మాయిలు మంచి పోరాట పటిమ ప్రదర్శించారు.
సెమీ ఫైనల్ కు
జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ 11వ రోజులో భారత్ విమెన్ హాకీ జట్టు అద్భుతాన్ని చేసింది. క్వార్టర్ ఫైనల్ లో బలమైన ఆస్ట్రేలియా జట్టుపై విజయం సొంతం చేసుకుని.. సగర్వంగా సెమి ఫైనల్ లో అడుగు పెట్టింది. అమ్మాయిలు అద్భుతం చేశారు అంటూ యావత్ భారతం ప్రశంసల వర్షం కురిపిస్తోంది.రాణి రాంపాల్ టీమ్ చరిత్ర సృషించడానికి భారత్ కు మరో పతకం అందుకోవడానికి ఇంకొక్క విజయం చాలు. చివరి వరకు ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా సాగిందీ క్వార్టర్ ఫైనల్ లో 1-0 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా పై భారత్ విజయ దుందుభి మోగించింది. రాణి రాంపాల్ టీమ్ చరిత్ర సృషించడానికి భారత్ కు మరో పతకం అందుకోవడానికి ఇంకొక్క విజయం చాలు. చివరి వరకు ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా సాగిందీ క్వార్టర్ ఫైనల్ లో 1-0 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా పై భారత్ విజయ దుందుభి మోగించింది.క్వార్టర్స్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి  ఇరు జట్లు బరిలోకి దిగాయి. బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను అన్ని విధాలుగా కట్టడి చేసిన రాణి సేన.. ఏ దశలోనూ వారిని కోలుకోకుండా మైదానం లో పాదరసంలా కదిలారు. ఓ వైపు స్ట్రైకర్లు..మరోవైపు డిఫెన్స్‌ టీం చక్కగా రాణించింది. దీంతో భారత్‌ గెలుపుని సొంతం చేసుకుంది. 1980 మాస్కో ఒలింపిక్స్‌ తర్వాత భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఒలింపిక్స్‌లో తొలిసారిగా సెమీస్‌ చేరింది.క్వార్టర్స్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి ఇరు జట్లు బరిలోకి దిగాయి. బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను అన్ని విధాలుగా కట్టడి చేసిన రాణి సేన.. ఏ దశలోనూ వారిని కోలుకోకుండా మైదానం లో పాదరసంలా కదిలారు. ఓ వైపు స్ట్రైకర్లు..మరోవైపు డిఫెన్స్‌ టీం చక్కగా రాణించింది. దీంతో భారత్‌ గెలుపుని సొంతం చేసుకుంది. 1980 మాస్కో ఒలింపిక్స్‌ తర్వాత భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఒలింపిక్స్‌లో తొలిసారిగా సెమీస్‌ చేరింది.
విమెన్ హాకీలో బలమైన జట్టుగాఆస్ట్రేలియాకు పేరుంది. సెమీస్ బెర్త్ కోసం భారత్ తో తలపడింది. హోరాహోరీగా  సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఒక్క గోల్‌ కూడా చేయకుండానే నిష్క్రమించింది. అయితే పూల్‌ ‘బి’లో ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన మొదటి ప్లేస్ లో నిలిచింది. పూల్ ఏ లో లాస్ట్ ప్లేస్ లో ఉన్న భారత్ తో క్వార్టర్ ఫైనల్ లో తలపడింది. విమెన్ హాకీలో బలమైన జట్టుగాఆస్ట్రేలియాకు పేరుంది. సెమీస్ బెర్త్ కోసం భారత్ తో తలపడింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఒక్క గోల్‌ కూడా చేయకుండానే నిష్క్రమించింది. అయితే పూల్‌ ‘బి’లో ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన మొదటి ప్లేస్ లో నిలిచింది. పూల్ ఏ లో లాస్ట్ ప్లేస్ లో ఉన్న భారత్ తో క్వార్టర్ ఫైనల్ లో తలపడింది.
భారత్ ను సెమీస్ కు చేర్చడం లో గుర్జీత్‌ కౌర్‌ ఈ మ్యాచ్ లో చేసిన ఏకైక గోల్. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కు తొలి, ఏకైక గోల్‌ను అందించి ప్రత్యేకంగా నిలిచింది గుర్జీత్‌ కౌర్‌. ఆమెకు ఇదే తొలి ఒలింపిక్స్. ఇటు డిఫెండర్‌గా.. అటు డ్రాగ్‌ఫ్లికెర్‌గా ఆమె సత్తా చాటుతుంది. .2019లో జపాన్‌లో జరిగిన ఎఫ్‌ఐహెచ్ విమెన్స్ సిరీస్ ఫైనల్లో ఎక్కువ గోల్స్ కొట్టింది గుర్‌జీత్‌నే. ఈ మ్యాచ్‌లో భారత్‌కు స్వర్ణం వచ్చింది.భారత్ ను సెమీస్ కు చేర్చడం లో గుర్జీత్‌ కౌర్‌ ఈ మ్యాచ్ లో చేసిన ఏకైక గోల్. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కు తొలి, ఏకైక గోల్‌ను అందించి ప్రత్యేకంగా నిలిచింది గుర్జీత్‌ కౌర్‌. ఆమెకు ఇదే తొలి ఒలింపిక్స్. ఇటు డిఫెండర్‌గా.. అటు డ్రాగ్‌ఫ్లికెర్‌గా ఆమె సత్తా చాటుతుంది. .2019లో జపాన్‌లో జరిగిన ఎఫ్‌ఐహెచ్ విమెన్స్ సిరీస్ ఫైనల్లో ఎక్కువ గోల్స్ కొట్టింది గుర్‌జీత్‌నే. ఈ మ్యాచ్‌లో భారత్‌కు స్వర్ణం వచ్చింది.టోక్యో ఒలింపిక్స్ లో తొలిసారిగా విమెన్ హాకీ టీమ్ సెమీస్ కు చేరడం లో భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి పాత్ర ఎన్నదగింది. టోక్యో ఒలింపిక్స్ లో హాకీ టీమ్ ఓటమి నుంచి గెలుపు వరకూ  పయనించడంలో రాణి టీమ్ కి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. 2020లో ‘‘వరల్డ్ గేమ్స్ అథ్లేట్ ఆఫ్ ది ఇయర్''అవార్డును గెలుచుకున్న తొలి హాకీ ప్లేయర్‌గా రాణి చరిత్ర సృష్టించింది.
15ఏళ్ల వయసు నుంచి రాణి భారత జట్టు తరఫున ఆడతుంది. టోక్యో ఒలింపిక్స్ లో తొలిసారిగా విమెన్ హాకీ టీమ్ సెమీస్ కు చేరడం లో భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి పాత్ర ఎన్నదగింది. టోక్యో ఒలింపిక్స్ లో హాకీ టీమ్ ఓటమి నుంచి గెలుపు వరకూ పయనించడంలో రాణి టీమ్ కి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. 2020లో ‘‘వరల్డ్ గేమ్స్ అథ్లేట్ ఆఫ్ ది ఇయర్''అవార్డును గెలుచుకున్న తొలి హాకీ ప్లేయర్‌గా రాణి చరిత్ర సృష్టించింది. 15ఏళ్ల వయసు నుంచి రాణి భారత జట్టు తరఫున ఆడతుంది.ఆస్ట్రేలియా ఒక్క గోల్ కూడా చేయలేదు అంటే దానిలో ప్రముఖ పాత్ర గోల్ కీపర్ సవితదే . 30 ఏళ్ల సవిత భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్. 18 ఏళ్ల వయసులోనే హాకీ ప్రస్థానాన్ని  మొదలు పెట్టిన సవితి 100కిపైనే పోటీల్లో పాల్గొంది. భారత జట్టులో మంచి అనుభవమున్న క్రీడాకారిణి ఆస్ట్రేలియా ఒక్క గోల్ కూడా చేయలేదు అంటే దానిలో ప్రముఖ పాత్ర గోల్ కీపర్ సవితదే . 30 ఏళ్ల సవిత భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్. 18 ఏళ్ల వయసులోనే హాకీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన సవితి 100కిపైనే పోటీల్లో పాల్గొంది. భారత జట్టులో మంచి అనుభవమున్న క్రీడాకారిణినిజానికి ఆసియాలోని అత్యుత్తమ మహిళల ఫీల్డ్ హాకీ జట్లలో భారత మహిళల హాకీ జట్టు ఒకటి. అంతర్జాతీయ వేదికగా అనేక పతకాలను దక్కించుకుంది. 1982 లో ఆసియా గేమ్స్ లో , 2002 కామన్వెల్త్ గేమ్స్‌ లోనూ గోల్డ్ మెడల్ ను ,2004, 2017లో రెండుసార్లు ఆసియా కప్‌ను  సొంతం చేసుకుంది.  2016లో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. అంతర్జాతీయ ర్యాంకింగ్ లో భారత విమెన్ హాకీ టీమ్ తమ స్థానాన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఈరోజు టోక్యో ఒలింపిక్స్ లో పతకం ముద్దాడడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. నిజానికి ఆసియాలోని అత్యుత్తమ మహిళల ఫీల్డ్ హాకీ జట్లలో భారత మహిళల హాకీ జట్టు ఒకటి. అంతర్జాతీయ వేదికగా అనేక పతకాలను దక్కించుకుంది. 1982 లో ఆసియా గేమ్స్ లో , 2002 కామన్వెల్త్ గేమ్స్‌ లోనూ గోల్డ్ మెడల్ ను , 2004, 2017లో రెండుసార్లు ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. 2016లో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. అంతర్జాతీయ ర్యాంకింగ్ లో భారత విమెన్ హాకీ టీమ్ తమ స్థానాన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఈరోజు టోక్యో ఒలింపిక్స్ లో పతకం ముద్దాడడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది.

Related Posts