YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

అక్టోబ‌ర్ 24న దుబాయ్‌లో ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్

అక్టోబ‌ర్ 24న దుబాయ్‌లో ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్

అక్టోబ‌ర్ 24న దుబాయ్‌లో ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్
న్యూ ఢిల్లీ ఆగష్టు 4
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు ముహూర్తం కుదిరింది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా అక్టోబ‌ర్ 24న దుబాయ్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 24నే ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ట్లు ఐసీసీ వ‌ర్గాలు వెల్ల‌డించాయ‌ని ఏఎన్ఐ స్ప‌ష్టం చేసింది. గ‌త నెల‌లోనే ఈ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఇండియాలో కాకుండా ఒమ‌న్‌, యూఏఈల్లో జ‌ర‌గ‌నుంద‌ని ఐసీసీ చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే టోర్నీని మాత్రం బీసీసీఐ నిర్వ‌హిస్తోంది. అక్టోబ‌ర్ 17 నుంచి న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ సూప‌ర్ 12లో గ్రూప్ 2లో ఉన్నాయి. దీంతో ఈ దాయాదుల పోరు ఖాయ‌మ‌ని అప్పుడే తేలినా.. తాజాగా ఈ మ్యాచ్ తేదీ కూడా ఖ‌రారైంది. మార్చి 20, 2021 నాటికి టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఐసీసీ జ‌ట్ల‌ను గ్రూపులుగా విభ‌జించింది. గ్రూప్ 1లో డిఫెండింగ్ చాంపియ‌న్స్ వెస్టిండీస్‌తోపాటు ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఉన్నాయి. ఇక గ్రూప్ 2లో ఇండియాతోపాటు పాకిస్థాన్, న్యూజిలాండ్‌, ఆఫ్ఘ‌నిస్థాన్ త‌ల‌ప‌డ‌నున్నాయి. మ‌రో నాలుగు టీమ్స్ క్వాలిఫ‌య‌ర్స్ నుంచి సూప‌ర్ 12కు అర్హ‌త సాధించ‌నున్నాయి.

Related Posts