YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు ఆంధ్ర ప్రదేశ్

మంత్రి అవంతిని కలిసిన సింధు

మంత్రి అవంతిని కలిసిన సింధు

విజయవాడ
ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు విజయవాడలో మంత్రి అవంతి శ్రీనివాస్ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడలో తనకు గ్రాండ్గా వెల్కమ్ లభించిందన్నారు. ఒలంపిక్స్ వెళ్లేముందు సీఎం జగన్ తనకు సపోర్ట్ చేశారని, అండగా ఉంటానని హామీ ఇచ్చారని పీవీ సింధు తెలిపారు. ఒలంపిక్స్లో పతకం తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఒలంపిక్స్ లో మెడల్ తీసుకురావడం ద్వారా గర్వంగా ఉందని చెప్పారు.కాంస్య పతకం పోరులో గెలిచిన తర్వాత రెండు నిమిషాలు బ్లాంక్ అయ్యానని పీవీ సింధు పేర్కొన్నారు. సెకండ్ టైమ్ ఒలంపిక్ మెడల్ దేశానికి తీసుకురా వడం సంతోషంగా ఉందన్నారు. తాను ఇక్కడే జాబ్ చేస్తున్నానని, అభిమానం చూపిన వారందరికి ఒలింపిక్ పతకా న్ని అంకితమిస్తున్నట్లు పీవీ సింధు పేర్కొన్నారు.

Related Posts