YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాజ్య‌స‌భ‌లో విప‌క్షాల తీరుపై చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు తీవ్ర ఆగ్ర‌హం

రాజ్య‌స‌భ‌లో విప‌క్షాల తీరుపై చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు తీవ్ర ఆగ్ర‌హం

రాజ్య‌స‌భ‌లో విప‌క్షాల తీరుపై చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు తీవ్ర ఆగ్ర‌హం
న్యూఢిల్లీ ఆగష్టు 11
రాజ్య‌స‌భ‌లో విప‌క్షాలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం స‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై ఎలా ఆగ్ర‌హం వ్య‌క్తం చేయాలో కూడా తెలియ‌డం లేదు. నేను నిద్ర‌లేని రాత్రి గ‌డిపాను అని వెంక‌య్య భావోద్వేగానికి గుర‌య్యారు. పార్లమెంట్ ఓ దేవాల‌యం వంటిది. స‌భ ప‌విత్ర‌త‌ను కాపాడ‌టంలో అంద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. మంగ‌ళ‌వారం స‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను పూర్తిగా ప్ర‌జ‌ల‌కు చూపించాలి.కొంద‌రు స‌భ్యులు టేబుల్స్‌పై ఎక్కి కూర్చోవ‌డం బాధించింది అని వెంక‌య్య అన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ స‌భ‌ను న‌డ‌ప‌లేనంటూ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కూ రాజ్య‌స‌భ‌ను వాయిదా వేశారు. స‌భ‌లో ఇలాంటి పరిస్థితుల‌ను టీవీల్లో చూపించ‌డం లేద‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారు. ఎందుకు చూపించ‌డం లేదో నాకు తెలియ‌దు. రాజ్య‌స‌భ టీవీ వీటిని చూపించాలి అని వెంక‌య్య అన్నారు.

Related Posts