YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

2డీజీ ఔష‌ధం వ‌ల్ల అమాంతంగా పెరుగనున్న ఆక్సిజ‌న్ లెవల్స్

2డీజీ ఔష‌ధం వ‌ల్ల అమాంతంగా పెరుగనున్న ఆక్సిజ‌న్ లెవల్స్

2డీజీ ఔష‌ధం వ‌ల్ల అమాంతంగా పెరుగనున్న ఆక్సిజ‌న్ లెవల్స్  
న్యూఢిల్లీ ఆగష్టు 13
2డీజీ ఔష‌ధం వాడ‌డం వ‌ల్ల క‌రోనా రోగుల్లో ఆక్సిజ‌న్ స్థాయి అమాంతంగా పెరుగుతంద‌ని ఇవాళ ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇలాంటి ఔష‌ధాన్ని మ‌రే దేశం కూడా త‌యారు చేయ‌లేద‌ని మంత్రి చెప్పారు. కానీ భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు ఆ అద్భుతాన్ని సాధించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. మ‌న దేశానికి చెందిన సైనిక ద‌ళాలు, శాస్త్ర‌వేత్త‌లు ఎన్న‌డూ దేశాన్ని నిరుత్సాహ‌పర‌చ‌లేద‌ని ఆయ‌న అన్నారు. క‌రోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న స‌మ‌యంలో.. డీఆర్‌డీవో నేతృత్వంలో త‌యారు చేసిన 2డీజీ ఔష‌ధాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

Related Posts