ఆసరా లేని వృద్ధులకు ప్రతి ఒక్కరు ఆదుకోవాలి
జన వికాస్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాహిర్
కడప ఆగస్టు13
కడప నగరంలోని ఆజాద్ నగర్ లో ఉన్న బృందా వృద్ధాశ్రమంనందు ఇస్లామిక్ నూతన సంవత్సర మొదటి పవిత్రమైన శుక్రవారం సందర్భంగా జనవికాస్ అధ్యక్షుడు తాహిర్ మేనమామ ముజాహిద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తాహిర్ మాట్లాడుతూ ఆసరా లేని వృద్ధులకు ప్రతి ఒక్కరు
ఆదుకోవాలి అని తల్లితండ్రులను ఎవరో మరవకూడదని తల్లితండ్రులను విస్మరిస్తే వారికి అథోగతే అని వారు తెలియజేశారు.
తమ చేత ఇలాంటి మంచి కార్యక్రమం చెప్పించినందుకు తమ మామ ముజాహిద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శంషాద్ బేగం, సుధారాణి ,బృందా నిర్వాహకులు బాలసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.