YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

క్ష‌మాభిక్ష పెట్టేశాం..పూర్తి భ‌రోసాతో మీ సాధార‌ణ జీవితాన్ని గ‌డ‌పండి. మంగ‌ళ‌వారం ప్ర‌క‌ట‌న‌ విడుద‌ల చేసిన తాలిబ‌న్లు

క్ష‌మాభిక్ష పెట్టేశాం..పూర్తి భ‌రోసాతో మీ సాధార‌ణ జీవితాన్ని గ‌డ‌పండి. మంగ‌ళ‌వారం ప్ర‌క‌ట‌న‌ విడుద‌ల చేసిన తాలిబ‌న్లు

క్ష‌మాభిక్ష పెట్టేశాం..పూర్తి భ‌రోసాతో మీ సాధార‌ణ జీవితాన్ని గ‌డ‌పండి
      మంగ‌ళ‌వారం ప్ర‌క‌ట‌న‌ విడుద‌ల చేసిన తాలిబ‌న్లు
న్యూ ఢిల్లీ ఆగష్టు 17
ఆఫ్ఘ‌నిస్థాన్‌ ను మ‌రోసారి త‌మ చేతుల్లోకి తీసుకున్న రెండు రోజుల త‌ర్వాత తాలిబ‌న్లు ఓ కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. దేశంలోని అంద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు క్ష‌మాభిక్ష పెట్టేశామ‌ని, అంద‌రూ వ‌చ్చి ఎప్ప‌టిలాగే ధైర్యంగా ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు. పూర్తి భ‌రోసాతో మీ సాధార‌ణ జీవితాన్ని గ‌డ‌పండి అంటూ మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తాలిబ‌న్లు స్ప‌ష్టం చేశారు. ఆదివార‌మే రాజ‌ధాని కాబూల్ స‌హా దేశం మొత్తాన్నీ తాలిబ‌న్లు తమ ఆధీనంలోకి తీసుకున్న విష‌యం తెలుసు క‌దా. వాళ్ల రాక్ష‌స రాజ్యాన్ని త‌లుచుకుంటూ ఇప్ప‌టికే ఎన్నో వేల మంది పౌరులు దేశాన్ని వ‌దిలి వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తాలిబ‌న్లు గ‌త ప్ర‌భుత్వంలో ప‌ని చేసిన ఉద్యోగుల‌కు క్ష‌మాభిక్ష పెట్టిన‌ట్లు ప్ర‌క‌టించ‌డం గ‌మనార్హం.

Related Posts