YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

అక్టోబ‌ర్ 24న పాకిస్థాన్‌తో టీ20 ఇండియా తొలి మ్యాచ్‌..       వ‌ర‌ల్డ్‌క‌ప్ షెడ్యూల్ రిలీజ్  చేసిన ఐసీసీ

అక్టోబ‌ర్ 24న పాకిస్థాన్‌తో టీ20 ఇండియా తొలి మ్యాచ్‌..       వ‌ర‌ల్డ్‌క‌ప్ షెడ్యూల్ రిలీజ్  చేసిన ఐసీసీ

అక్టోబ‌ర్ 24న పాకిస్థాన్‌తో టీ20 ఇండియా తొలి మ్యాచ్‌..
      వ‌ర‌ల్డ్‌క‌ప్ షెడ్యూల్ రిలీజ్  చేసిన ఐసీసీ
న్యూ ఢిల్లీ ఆగష్టు 17
అక్టోబ‌ర్ 17 నుంచి న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ జ‌ర‌గ‌బోయే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ లో టీమిండియా త‌న తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడ‌బోతోంది. అక్టోబ‌ర్ 24న ఈ మ్యాచ్ దుబాయ్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను మంగ‌ళ‌వారం ఐసీసీ రిలీజ్ చేసింది. ఇక రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమ‌న్, పపువా న్యూ గినియా మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబ‌ర్ 17న ఈ మ్యాచ్ జ‌రుగుతుంది. అదే రోజు స్కాట్లాండ్‌, బంగ్లాదేశ్ మ‌రో మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి.ఇక అక్టోబ‌ర్ 23న అస‌లు టోర్నీ అంటే సూప‌ర్ 12 స్టేజ్ ప్రారంభ‌మ‌వుతుంది. అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా త‌ల‌ప‌డ‌తాయి. అదే రోజు దుబాయ్‌లో సాయంత్రం ఇంగ్లండ్‌, వెస్టిండీస్ ఆడ‌నున్నాయి. ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7.30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. టీమిండియా త‌న త‌ర్వాతి మ్యాచ్‌ల‌ను అక్టోబ‌ర్ 31న న్యూజిలాండ్‌తో, న‌వంబ‌ర్ 3న ఆఫ్ఘ‌నిస్థాన్‌తో, నవంబ‌ర్ 5న గ్రూప్ బిలో టాప్ పొజిష‌న్‌లో నిలిచిన టీమ్‌, న‌వంబ‌ర్ 8న గ్రూప్ ఎలో రెండో స్థానంలో నిలిచిన టీమ్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ల‌న్నీ భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7.30 గంట‌ల‌కే ప్రారంభ‌మ‌వుతాయి.న‌వంబ‌ర్ 10న అబుదాబిలో తొలి సెమీఫైన‌ల్ జ‌రుగుతుంది. ఆ మ‌రుస‌టి రోజు అంటే న‌వంబ‌ర్ 11న దుబాయ్‌లో రెండో సెమీస్ జ‌రుగుతుంది. రెండు సెమీఫైన‌ల్స్‌కు రిజ‌ర్వ్ డే ఉంటుంది. ఫైన‌ల్ న‌వంబ‌ర్ 14న దుబాయ్‌లో జ‌ర‌గుతుంది. మ‌రుస‌టి రోజును రిజ‌ర్వ్ డేగా ఉంచారు.

Related Posts