YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

రాష్ట్రంలో ముగిసిన కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌.. పెరుగుతున్న సీజనల్‌ వ్యాధులు

రాష్ట్రంలో ముగిసిన కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌.. పెరుగుతున్న సీజనల్‌ వ్యాధులు

రాష్ట్రంలో ముగిసిన కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌.. పెరుగుతున్న సీజనల్‌ వ్యాధులు
హైదరాబాద్‌ ఆగష్టు 18
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ముగిసిందని ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొవిడ్‌ చాలావరకు అదుపులోకి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జ్వరం వస్తే కొవిడ్‌ కారణంగానే సంక్రమించిందని అనుకోవద్దని ప్రజలకు సూచించారు. జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. బుధవారం కింగ్‌కోఠిలోని తన కార్యాలయంలో డీహెచ్‌ శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడారు. సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో 340 మలేరియా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా హైదరాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1200కుపైగా డెంగీ కేసులు వచ్చినట్లు తెలిపారు. 13 జిల్లాల్లో మలేరియా, డెంగీ అధికంగా ఉన్నాయని గుర్తించామని శ్రీనివాస రావు వెల్లడించారు.
రాష్ట్రంలో 1.65 కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 1.65 కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో 56 శాతం మందికి తొలి డోస్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు వెల్లడించారు. 34 శాతం మందికి రెండు డోసులు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో దాదాపు 100శాతం మందికి.. జీహెచ్‌ఎంసీలో 90శాతం మందికి కనీసం ఓ డోస్‌ పూర్తి చేశామని చెప్పారు.

Related Posts