YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ

ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ

విజయవాడ
ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న  ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు. రెండు దశల్లో కోవిడ్ మిగిల్చిన నష్టం కారణంగా  ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. పాఠశాలలు పునప్రారంభం రోజే కర్నూలు జిల్లా కోయిలకుంట్ల  ఒక ప్రైవేట్ పాఠశాల నడుపుతున్న దంపతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. పాఠశాల నిర్వహణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎంతో ఒత్తిడికి గురై  బలవన్మరణం చెందారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ముందుగానే అర్ధవంతమైన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదు.   ఏపీలో దాదాపు 12,000 కంటే ఎక్కువ  ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో  1.25 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. మార్చి 2020 లో లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి వేలాది మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు సక్రమంగా జీతాలు లేవు. గత 5 నెలల్లో, పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో పనిచేసే దాదాపు 5 లక్షల మంది బోధన మరియు బోధనేతర సిబ్బంది ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు భరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితి. ఆకలి, అప్పుల సమస్య విద్యా రంగాన్ని ఎంతో  బాధిస్తుండటం కలచివేస్తోందని అన్నారు.
బోధనా వృత్తిలో జీతాలు రాక ఉపాధ్యాయులు  కూరగాయలు విక్రయించడం, భవన నిర్మాణ కార్మికులు గా, వ్యవసాయ కూలీలు గా మారటం వంటి విషాద గాధలు ఎన్నో మీడియాలో చూస్తున్నాం. కోవిడ్ తదనంతర పరిణామాలు వల్ల అనేక మంది  ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారు.  భారతీయ సంస్కృతి,  సమాజ విలువలను తీర్చిదిద్దే గురువుల గురించి ఎన్నో ప్రసంగాలు ఇచ్చిన మీరు ప్రైవేట్ విద్యా రంగంలో పనిచేసే సిబ్బందికి తక్షణ సహాయం అందించడం ద్వారా చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలి.  ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఇప్పటికే పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలతో పాటు ఇతర రాష్ట్రాలు తోచిన సాయం అందించాయి. తెంలంగాణ ప్రభుత్వం నెలకి 2 వేల రూపాయిల ఆర్థిక సాయం,25 కిలోల బియ్యం అందించింది.కర్ణాటక ప్రభుత్వంనెలకి 5 వేల రూపాయిల ఆర్థిక సహాయాన్ని ప్రైవేట్ ఉపాధ్యాయులకు అందించారు.  ఏపీ ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీవనోపాధికి తగిన భద్రత ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు.

Related Posts