YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

లండన్ వీధుల్లో విరట్ సందడి

లండన్ వీధుల్లో విరట్ సందడి

లండన్ వీధుల్లో విరట్ సందడి
లండన్, ఆగస్టు 20, 
టీమిండియా ప్లేయర్‌లు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా ఆ దేశంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో టెస్టు తర్వాత దొరికిన ఖాళీ సమయాన్ని ప్లేయర్స్‌ సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ టూర్‌కు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన సతీమణి అనుష్కను కూడా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇక రెండో టెస్టులో భారత్‌ అద్భుత విజయం సాధించిన విజయోత్సాహాంలో ఉన్న ఉన్న కోహ్లి భార్య అనుష్కతో లండన్‌ నగర విధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఇందులో భాగంగానే ఈ జంట తాజాగా లండన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు.ఆ రెస్టారెంట్‌లో ఈ జంట ఓ శాకాహార ఆహారాన్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తాము తిన్న ఫుడ్‌కి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసిన అనుష్క.. ‘నేను ఇప్పటి వరకు తిన్న బెస్ట్ వెజిటేరియన్‌ ఫుడ్‌’ ఇదేనంటూ కామెంట్‌ చేశారు. ఇక ఈ రెస్టారెంట్‌కు చెందిన చెఫ్‌ రిషిమ్‌ సచ్‌దేవా విరుష్క జంటతో దిగిన ఫొటోను సైతం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో ఈ జంట చూడముచ్చటగా కనిపిస్తోంది. దీంతో అటు అనుష్క అభిమానులు ఇటు విరాట్‌ ఫ్యాన్స్‌ తెగ ముచ్చట పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ దంపతులు ఇటీవల తాము పూర్తి శాకాహారులుగా ఉంటున్నామని తెలిపిన విషయం విధితమే. ఇక ఇండియా-ఇంగ్లాండ్‌ల మధ్య మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ఆగస్టు 25న ప్రారంభంకానుంది

Related Posts