YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

 మత సామరస్యానికి ప్రతీక రొట్టెల పండుగ  జనసేన గునుకుల కిషోర్

 మత సామరస్యానికి ప్రతీక రొట్టెల పండుగ  జనసేన గునుకుల కిషోర్

 మత సామరస్యానికి ప్రతీక రొట్టెల పండుగ
 జనసేన గునుకుల కిషోర్
 నెల్లూరు
మత సామరస్యానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు తమ కోర్కెలు తీర్చాలంటూ వేడుకొనే బారాషహీద్ దర్గా లో జనసేన పార్టీ తరపున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్  సీఎం కావాలని కోరుకుంటూ బారా షహీద్ దర్గా లో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్  ,ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్, జనసేన సిటీ నాయకులు దిగ్విజయ్ బాబు ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 మంది అమర మహమ్మదీయ వీరుల చిహ్నంగా ఏర్పాటు చేసిన బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా నిషేధించబడినది అని , 2018న అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ఇక్కడికి విచ్చేసి ప్రార్థన చేయడం జరిగిందని ,అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ గురువులచే ప్రార్థనలు జరిపించి, ఇక్కడ వస్త్రాన్ని గ్రంథాన్ని అధ్యక్షులు  పవన్ కళ్యాణ్కి అందజేయటం జరుగుతుందని తెలిపారు.మతసామరస్యానికి ప్రతీకగా ప్రపంచ ప్రసిద్దిగాంచి ఎంతోమంది కోర్కెలు తీర్చిన బారాషహీద్ దర్గా లో ప్రత్యేక పూజలు జరిపామని మెగాస్టార్  పద్మభూషణ్ చిరంజీవి జన్మదిన సందర్భంగా ఆయన ఆశీస్సులు అందజేయాలని, అదేవిధంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఆయురారోగ్యాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి  పవన్ కళ్యాణ్ ప్రజా నాయకులు అవ్వాలనీ ప్రార్థనలు జరిపి కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తెగలు చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి గునుకుల కిషోర్, సిటీ నాయకులు దుగ్గిసెట్టి సుజయ్ బాబు  కార్యదర్శి మడపర్తి ప్రశాంత్ గౌడ్ తో పాటు పలువురు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts