హైదరాబాద్
గోకుల్ చాట్, లుంబినీపార్కు బాంబు పేలుళ్లు జరిగి నేటికి 14 ఏళ్లు పూర్తయ్యాయి. గోకుల్చాట్, లుంబినీపార్కు బాంబు పేలుళ్లకు పాల్పడిన దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని బాధితులు డిమాండు చేసారు. పేలుళ్లు జరిగి నేటికి 14 ఏళ్లు అయిన సందర్భంగా... గోకుల్ చాట్ వద్ద మృతులకు పలువురు నివాళులర్పించారు. పేలుళ్లలో అవయవాలు కోల్పోయి బాధలు పడుతున్న వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు కోరారు.