YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ప్రభుత్వాసుపత్రిలో  తొలి ఆక్సిజన్, బాట్లింగ్ ప్లాంట్

ప్రభుత్వాసుపత్రిలో  తొలి ఆక్సిజన్, బాట్లింగ్ ప్లాంట్

ప్రభుత్వాసుపత్రిలో  తొలి ఆక్సిజన్, బాట్లింగ్ ప్లాంట్
నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆక్సిజన్ ప్లాంట్, బాటిలింగ్ యూనిట్ ను బుధవారం రోజున రాష్ట్ర రోడ్లుభవనాలు, గృహనిర్మాణ మరియు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. మిత్రుల సహకారంతో రూ. కోటి ఖర్చుతో ఇప్పటికే బాల్కొండ నియోజకవర్గంలో 102 ఆక్సిజన్ బెడ్లు, 14 ఐ సి యూ బెడ్లను ఏర్పాటు చేశారు.12 ప్రభుత్వ హాస్పిటల్స్ లో RO ప్లాంట్స్,రిసెప్షన్ ఏరియా మరియ ఇతర సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు. దీంతో పాటు ఆర్మూర్, బోధన్ ఆసుపత్రుల్లో 10 ఐ సి యూ బెడ్లను ఏర్పాటు చేయిస్తున్నారు.
ఈ సందర్బంగా మంత్రి వేముల మాట్లాడుతూ  కరోనా రెండవ విడతలో అనేకమంది ఆత్మీయులను, పార్టీ కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కోల్పోయిన బాధ వెంటాడిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎంతో బాధ కలిగించింది. సకాలంలో  ఈ మేధో మధనంలోనే అక్షిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సంకల్పం కలిదగింది. మిత్రుల సహకారంతో వెంటనే రూ. కోటి సమకూర్చి చెక్కును కలెక్టర్ కు అందజేశాను. పనులు వెంటనే చేపట్టి మూడో వేవ్ కరోన ఎదుర్కొనేందుకు సిద్ధం చేయడం జరిగిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
  కోట్లు సంపాదించిన కూడా కలగని ఆనందం ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్న సందర్బంగా కలిగింది. రోజుకు 50 ఆక్సిజన్ సిలెండర్ లు నింపుకుని సమర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేయడంతో మోర్తాడ్ నుండి నియోజకవర్గం లోని ఇతర హాస్పిటల్స్ కి ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసే విధంగా పూర్తిస్థాయిలో సౌకర్యాలు సిద్ధమయ్యాయి.

  ఆసుపత్రుల్లో మంచి వాతావరణాన్ని ఏర్పరచాలని వైద్యులకు, సిబ్బందికి మంత్రి ఆదేశాలు జారిచేశారు.
కరోనా మళ్ళీ వచ్చినా బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఆక్సిజన్ అందక, బెడ్స్ లేకుండా ఒక్కరు చనిపోవడానికి వీల్లేదని సంకల్పం తీసుకున్నాను. పూర్తిస్థాయి చికిత్స అందిన తర్వాత ఇకపై దేవుడిపై భారం వేద్దాం.
.... అధికారం శాశ్వతం కాదు
అధికారం ఎప్పటికి శాశ్వతం కాదు. పదవులు వస్తాయి, పోతాయి. కానీ పదవుల్లో వున్నప్పుడు ప్రజలకు ఎప్పటికి గుర్తుండిపోయే, అవసరమయ్యే పనులు చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.  అందుకే ప్రజల ఆరోగ్యం ప్రథమప్రాధాన్యతలో తీసుకుని పనులు చేపడుతున్నాము. దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కోవిడ్ సందర్బంగా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి కోవిడ్ మరణాలను నిలువరించడంలో సఫలం అయ్యారు. నిజామాబాద్ జిల్లాలో సరిపడా రేమిడిసివిర్ ఇంజెక్షన్లు విరివిగా అందుబాటులో ఉంచగలిగారు. ఇలా కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కోగలిగామని మంత్రి చెప్పారు.
    పూర్తిస్థాయిలో ఆక్సిజన్ బెడ్ ఏర్పాటు చేయటమే కాకుండా  102 ఆక్సిజన్ సిలెండర్లను వారం రోజుల్లో బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచుతా. ఇదివరకు మాదిరి కాకుండా ఇకపై ఆక్సిజన్ అందక, బెడ్లు దొరకక ఏ ఒక్కరు మరణించారనే వార్త వినకూడదు అనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరించారు.

Related Posts