YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఆన్‌లైన్‌ క్లాసులు పెడితే కఠిన చర్యలు మంత్రి సురేష్‌

ఆన్‌లైన్‌ క్లాసులు పెడితే కఠిన చర్యలు మంత్రి సురేష్‌

అమరావతి
ఆన్‌లైన్‌ క్లాసులు ప్రత్యామ్నాయం మాత్రమేనని ఎపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. పాఠశాలలు, కాలేజీలు తెరిచాక కూడా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని కొన్ని పాఠశాలలలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి వాస్తవమేనని తెలిపారు. 10 కన్నా ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో పాఠశాలలు ప్రారంభించవద్దని గతంలోనే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. పాఠశాలలు, కాలేజీల్లో ఫీజులకు సంబంధించి 53, 54 జీవోలను జారీ చేశామని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఎపిలో ఈ నెల 16 నుంచి పాఠశాలలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు.

Related Posts