YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

ఆగ‌స్టు 30న ఎస్వీ గోశాలలో గోకులాష్టమి 'గోపూజ'       

ఆగ‌స్టు 30న ఎస్వీ గోశాలలో గోకులాష్టమి 'గోపూజ'       

ఆగ‌స్టు 30న ఎస్వీ గోశాలలో గోకులాష్టమి 'గోపూజ'       
తిరుప‌తి,  ఆగ‌స్టు 28
తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగ‌స్టు 30న సోమవారం  గోకులాష్టమి గోపూజ ఉత్సవం  నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ కార్య‌క్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 10.30 గంటలకు 'గోపూజ మహోత్సవం' జరుగనుంది. ఆ తరువాత శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో పూజ, హారతి ఇస్తారు. భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారు. గోపూజ‌ వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందని భ‌క్తుల నమ్మకం. ఈ సంద‌ర్భంగా గోవుల‌ను ప్ర‌త్యేకంగా అలంక‌రించి అర్చ‌కులు పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

Related Posts