YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

సంప్రదాయ భోజనం నిలిపివేత

సంప్రదాయ భోజనం నిలిపివేత
సంప్రదాయ భోజనం నిలిపివేత
తిరుమల
తిరుమలలో సాంప్రదాయ భోజనంపై టిటిడి వెనక్కి తగ్గింది. సాంప్రదాయ భోజనంపై సోషల్ మీడియాలో దుష్ ప్రచారం చేయడం తగదని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు. ఇవాళ ఉదయం స్వామి వారి సేవలో పాల్గోన్న ఆయన ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. టిటిడి పాలక మండలి లేని సమయంలో టిటిడి అధికారులు ఒక మంచి ఉద్దేశంతో సాంప్రదాయ భోజనం ప్రవేశ పెట్టారని,అయితే సాంప్రదాయ భోజనంపై అధికారులతో చర్చించి సాంప్రదాయ భోజనంను నేటి నుండి నిలిపి వేస్తున్నాంమని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు..సోషల్మీడియాలో వస్తున్న కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని భక్తులు ఏవరూ నమ్మద్దని ఆయన కోరారు..కృష్ణాష్టమి సందర్భంగా టిటిడిలో నూతన సేవకు శ్రీకారం చుట్టబోతున్నాంమని,కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నవనీత సేవ కార్యక్రమంను ఇవాల్టి నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు..టిటిడిలో ఇప్పటికే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాంమని, అందులో భాగంగానే గుడికో గోమాత,గోపూజ, గోవిందునికి గోధారిత నైవేద్యం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ..నవనీత సేవ లాంటి ఒక కొత్త అధ్యయంకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు..శ్రీవారి నైవేద్యంకు,కైంకర్యాలకు కావాల్సిన పదార్ధాలు సాంప్రదాయబద్ధంగా గోవు నుండి పాలను,నెయ్యిని, వెన్నను సేకరచి స్వామి వారికి అందింస్తున్నట్లు తెలిపారు.తిరుమలలో ఏ ఆహారంమైన స్వామి వారి ప్రసాదంగానే అందించాలని అందుకనే సాంప్రదాయ భోజనంను నిలిపి వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు..కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో సర్వదర్శనాలపై ఇప్పుడే నిర్ణయం తీసుకోంమని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు.

Related Posts