YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

గోశాలలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి గో పూజ -  పాల్గొన్న టీటీడీ చైర్మన్ , ఈవో

గోశాలలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి గో పూజ -  పాల్గొన్న టీటీడీ చైర్మన్ , ఈవో

గోశాలలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి గో పూజ
-  పాల్గొన్న టీటీడీ చైర్మన్ , ఈవో
తిరుపతి, మా ప్రతినిధి,ఆగస్టు 30
టీటీడీ గోశాలలో సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా గోకులాష్టమి గోపూజ కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ చైర్మన్   వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి గోశాల లోని శ్రీ వేణుగోపాలస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం గోమాత, దూడ కు అర్చకుల మంత్రాల నడుమ నూతన వస్త్రాలు, పూలమాలలు వేసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం గోమాత, దూడకు ప్రదక్షిణలు చేసి హారతి ఇచ్చారు.  గోమాత పాలు పితికి వాటిని తీసుకుని వెళ్ళి అర్చకులకు అందించి అభిషేకం చేయించారు.
     అనంతరం శ్రీ వేంకటేశ్వర మహామంత్ర పుస్తక జపసమర్పణ (7 కోట్ల సార్లు ఓనమో వేంటేశాయ )  ఆలయాన్ని సందర్శించి అక్కడి పుస్తకంలో ఓం నమో వేంకటేశాయ అని రాశారు. సివి ఎస్వో  గోపీనాథ్ జెట్టి, అదనపు సివి ఎస్వో  శివకుమార్ రెడ్డి, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, విజిఓ  మనోహర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Related Posts