YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

టాలీవుడ్ డ్రగ్స్ కేసు…..హజరయిన పూరి జగన్నాథ్

టాలీవుడ్ డ్రగ్స్ కేసు…..హజరయిన పూరి జగన్నాథ్

హైదరాబాద్
గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తు ను ఈడీ వేగవంతం చేసింది. పోయినవారం కొందరికి తేదీన వారిన హజరకమ్మని నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ నేపధ్యంలో మంగళవారం నాడు సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈడీ కార్యాలయానికి హాజరైయారు.  అయనను అధికారులు విచారించారు. పూరి జగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారం సేకరించారని సమాచారం. ఈ డ్రగ్స్ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కీలక అంశాల పై ప్రశ్నించారు. పూరి తో పాటు ఆయన కుమారుడు ఆకాష్,  సీఏ ( చార్టెడ్ అకౌంటెట్ )లు ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.. 2017లో ఎక్సైజ్ శాఖ బుక్ చేసిన కేసులో పూరీని ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. డ్రగ్స్ కొనుగోలు వ్యవహారంలో విదేశీ పెడలర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ కొనసాగుతోంది.. డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గా ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఏ రూపంలో కొనుగోలు చేశారు అన్న కోణంలో విచారణ సాగనుంది.
డ్రగ్స్ కేసులో హవాలా మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. డ్రగ్స్ కోసం పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులను మళ్లించినట్లుగా గుర్తించారు.. దీంతో.. ఈడీ విచారణ ఇప్పుడు కీలకంగా మారింది.

Related Posts