YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఆకాశాన్ని అంటూతున్న గ్యాస్ ధరలు

ఆకాశాన్ని అంటూతున్న గ్యాస్ ధరలు

ఇష్టారాజ్యంగా గ్యాస్ ధరలు పెంచుతున్న బిజెపి ప్రభుత్వానికి పతనం తప్పదు అంటున్న సీపీఐ నాయకులు. బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించిన సీపీఐ నంద్యాల నియోజకవర్గ, పట్టణ కార్యదర్శులు బాబా ఫక్రుద్దీన్,ప్రసాద్. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ నరేంద్ర మోడీ ప్రజా వ్యతురేఖ విధానాలను నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)ఆధ్వర్యంలో నంద్యాలలో మౌలానా ఆజాద్ సర్కిల్ లో గురువారం నాడు ధర్నా నిర్వహించడం జరిగిందని సీపీఐ నంద్యాల నియోజకవర్గ, పట్టణ కార్యదర్శులు బాబా ఫక్రుద్దీన్,ప్రసాద్ లు తెలిపారు. 
ఈ కార్యక్రమంలో ఏఐవైప్  రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు, ఎఐటియుసి నంద్యాల కార్యదర్శి డి.శ్రీనివాసులు,ఏఐయస్ ప్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు, ఏఐయస్ ప్ నంద్యాల డివిజన్ కార్యదర్శి సురేష్,జిల్లా కార్యవర్గ సభ్యుడు హరికృష్ణ, ఏఐవైప్ నంద్యాల పట్టణ కార్యదర్శి విష్ణు,సీపీఐ నాయకులు అజిస్,సుబ్బారాయుడు,కలాం, ఉషేన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Related Posts