YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

3 అసెంబ్లీ, ఎంపీ స్థానానికి 30న పోలింగ్

3 అసెంబ్లీ, ఎంపీ స్థానానికి 30న పోలింగ్

3 అసెంబ్లీ, ఎంపీ స్థానానికి 30న పోలింగ్
కోల్ కత్తా, సెప్టెంబర్ 4, 
పశ్చిమ్ బెంగాల్‌లోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప-ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ శనివారం వెల్లడించింది. బెంగాల్‌లోని భవానీపూర్, షంసేర్‌గంజ్, జంగీపూర్ మూడు స్థానాలు సహా ఒడిశాలోని పింప్లీ అసెంబ్లీకి సెప్టెంబరు 30న పోలింగ్ నిర్వహించనున్నారు. ఫలితాలను అక్టోబరు 3న ప్రకటించనున్నారు. అయితే, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 31 అసెంబ్లీ స్థానాలకు కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో దసరా తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ స్పష్టం చేసింది.పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి రాజ్యాంగపరమైన అత్యవసర, ప్రత్యేక అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని భవానీపూర్ ఉప ఎన్నికను నిర్వహించాలని నిర్ణయించాం... కఠినమైన కోవిడ్-19 నిబంధనల పాటించాలని కమిషన్ హెచ్చరించింది.. సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ప్రధాన ఎన్నికల అధికారుల నివేదికలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మిగతా 31 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు లోక్‌సభ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలను నిర్వహించకూడదని కమిషన్ నిర్ణయించింది’ అని పేర్కొంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్కడ రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. మే నెల మధ్యలో రోజువారీ కేసులు 20వేలకుపైగా నిర్ధారణ అయ్యాయి. అయితే, శనివారం ఉదయం వరకూ పాజిటివ్ కేసుల వారం రోజుల సగటు 640కి దిగువన ఉంది. బెంగాల్‌లో ప్రస్తుతం కరోనా అదుపులో ఉందని, ఉప-ఎన్నిక నిర్వహించాలని ఈసీకి పదే పదే కోరుతూ వస్తోంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల ప్రకారం ఎన్నికల కమిషన్ నడుచుకుంటోందని మమతా బెనర్జీ పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు.ఈ అంశంపై అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఏప్రిల్-మే నెలలో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గానూ టీఎంసీ 213 చోట్ల విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. అయితే, నందిగ్రామ్ నుంచి పోటీచేసిన సీఎం మమతా బెనర్జీ ఒకప్పుడు తన కుడిభుజం, బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓటమిచవిచూశారు. సొంత నియోజకవర్గం భవానీపూర్‌‌ను వదిలేసి నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగారు.నందిగ్రామ్‌లో ఓటమిపై మమతా ఎన్నికల పిటిషన్ దాఖలు చేయగా.. అది ఇంకా కోర్టు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో భవానీ‌పూర్ నుంచి మళ్లీ మమతా పోటీచేయనున్నారు. ముఖ్యమంత్రిగా మమతా బాధ్యతలు చేపట్టినా నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టి నవంబరు నాటికి ఆరు నెలలు పూర్తికానుండగా.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు బెంగాల్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సెప్టెంబరులో ఉప-ఎన్నిక నిర్వహణకు ఈసీ ముందుకొచ్చింది.తెలంగాణలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ఈసీ స్పందించింది. దసరా తర్వాతే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పండగల సీజను ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని వెల్లడించింది.

Related Posts