YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఏపిలో ఎంసెట్ ఫలితాలు విడుదల

ఏపిలో ఎంసెట్ ఫలితాలు విడుదల

అమరావతి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎంసెట్ పరీక్షలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే ఏపీ ఎంసెట్ పరీక్ష ఫలితాలను ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు 1,75,8687 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఇందులో 1, 66, 460 మాత్రమే హాజరయ్యారని ఆయన వెల్లడించారు. ఇక పరీక్ష ఫలితాల్లో 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు స్పష్టం చేశారు. ఇక విద్యార్థుల రెస్పాన్స్ షీట్ లను ఈ నెల 26 నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తామన్నారు. అలాగే రేపటి నుంచి వెబ్సైట్ లో ర్యాంక్ కార్డులు అందుబాటు లో ఉంటాయని తెలిపారు. ఈ నెల 18 వ తేదీ నుంచి ఇంజినీరింగ్ మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. అయితే కరోనా సోకి పరీక్ష రాయని విద్యార్థులకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు విద్యా శాఖ మంత్రి.

Related Posts