YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

దేశంలో కొత్తగా 37,875 కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో కొత్తగా 37,875 కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో కొత్తగా 37,875 కరోనా పాజిటివ్‌ కేసులు
న్యూఢిల్లీ సెప్టెంబర్ 8
దేశంలో కొత్తగా 37,875 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 369 మంది మరణించారు. గత 24 గంటల్లో మరో 39,114 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,30,96,718కు చేరింది. ఇందులో 3,22,64,051 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, 3,91,256 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,41,411 మంది బాధితులు మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 25,772 కేసులు ఉన్నాయని, 189 మంది మరణించారని తెలిపింది.ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటివరకు మొత్తం 70,75,43,018 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. ఇందులో గత 24 గంటల్లో 78,47,625 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొన్నది.

Related Posts