YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఏసీబీ ఆఫీసులో దొంగలు పడ్డారు

ఏసీబీ ఆఫీసులో దొంగలు పడ్డారు

కరీంనగర్, సెప్టెంబర్ 11, 
కరీంనగర్ ఏసీబీ కార్యాలయంలో అదృశ్యమైన బంగారం, నగదు విషయంలో ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. అవినీతి అధికారుల వద్ద సీజ్ చేసిన బంగారంలో సుమారు 15 తులాలు, లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్‌గా స్వాధీనం చేసుకున్న రూ. 2 లక్షలకు పైగా నగదు విషయంలో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్టుగా సమాచారం. 2009 సంవత్సరంలో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని మాయం చేసి రోల్డ్ గోల్డ్ నగలు పెట్టిందెవరూ అన్న విషయంపై అధికారులు ప్రస్తుతం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కేవలం వేటు పడ్డ డీఎస్పీ ఒక్కడి ప్రమేయం ఉందా..? ఇంకొందరు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారా అన్న విషయంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.
నిజామాబాద్ డీఎస్పీగా పని చేస్తున్న వేణు గోపాల్ ఈ వ్యవహారానికి బాధ్యున్ని చేస్తూ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సేఫ్ లాకర్లో పెట్టాల్సిన సీజ్డ్ ప్రాపర్టీ, ట్రాప్ కేసుకు సంబంధించిన కరెన్సీ సరిగానే ఉందా లేదా అని పర్యవేక్షణ చేయడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వీటిని పర్యవేక్షించాల్సింది ఎవరు..? కోర్టుకు, ఉన్నతాధికారులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యులెవరు అన్న విషయంపై ఏసీబీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సేఫ్ కస్టడీలో ఉంచాల్సిన బంగారాన్ని కార్యాలయంలో భద్రపర్చడం విచిత్రంగా ఉంది. సాధారణంగా నిత్యం పోలీసు పహారాలో ఉంటుందన్న ఉద్దేశ్యంతో ట్రెజరీ కార్యాలయాల్లో ఇలాంటివి స్టోర్ చేస్తుంటారు. ట్రెజరీలు, పోస్టాఫీసులకు చెందిన స్ట్రాంగ్ రూంల తాళాలు సంబంధిత పోలీస్ స్టేషన్లలోనే భద్రపరిచేవారు. కానీ కరీంనగర్ ఏసీబీ కార్యాలయంలో ఇలాంటి పకడ్బందీ చర్యలు తీసుకోలేదని స్పష్టం అవుతోంది. భద్రత నడుమ సీజ్డ్ ప్రాపర్టీ ఉన్నట్టయితే దారి మల్లేవి కావని స్పష్టం అవుతోంది.కరీంనగర్ ఏసీబీ కార్యాలయంలో గోల్డ్, ట్రాప్డ్ కేసు కరెన్సీ సీజ్ చేసిన కేసుల్లో అధికారులు ఛార్జిషీట్ ఎప్పుడు వేశారు. వేసినపుడు సంబంధిత కేసులకు సంబంధించిన వివరాలను సరిచూసుకోలేదా? అన్న విషయం అంతు చిక్కకుండా మారింది. చార్జిషీట్ వేసిన తరువాతే అవి మిస్సయితే కోర్టు పరిధిలో ఉన్న ప్రాపర్టీ అన్న విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదో కూడా అర్థం కాకుండా పోయింది.అవినీతి నిరోధక విభాగానికి చెందిన కార్యాలయాలు సురక్షితమేనా..? అన్న ప్రశ్న కూడా ప్రస్తుతం తలెత్తుతోంది. స్టేట్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న డీజీ ఆఫీసు తప్ప రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. కరీంనగర్‌లో మాత్రమే ప్రభుత్వ భవనం ఉంది. రాష్ట్రంలోని మిగతా చోట్ల అద్దె భవనాల్లో ఏసీబీ కార్యాలయాలు నడుస్తున్నాయి. 2019లో కరీంనగర్‌లో ప్రారంభించిన ఏసీబీ ఆఫీసు భవనంలో కూడా భద్రత డొల్లతనం స్పష్టంగా కనిపించింది. ఇక్కడ స్ట్రాంగ్ రూం కానీ, సేఫ్ లాకర్ కానీ లేకపోవడంతో ట్రెజరీ కార్యాలయంలో వీటిని భద్రపరుస్తున్నట్టుగా సమాచారం. సొంత భవనాలు కట్టినా సీజ్డ్ ప్రాపర్టీని సేఫ్‌గా ఉంచేందుకు అనుగుణంగా మాత్రం లాకర్లను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఇతర జిల్లాల్లో అయితే అన్ని ప్రైవేటు బిల్డింగ్ లే కావడంతో ఆయా చోట్ల ఏసీబీ కేసుల్లో సీజ్ చేసిన నగదు, బంగారాన్ని సేఫ్‌గా ఉంచేందుకు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితే ఉంది. ఏదిఏమైనా కరీంనగర్ ఏసీబీ కార్యాలయం వ్యవహారం మాత్రం పోలీసు ఉన్నతాధికారుల ముందు ఎన్నో సవాళ్లను ఉంచిదన్నది మాత్రం వాస్తవం.కరీంనగర్ ఏసీబీ ఆఫీసు నుండి రికవరీ చేసిన బంగారం, ఆభరణాలు, ట్రాప్ కేసులో పట్టుకున్న నగదు మిస్సింగ్ అయిన విషయంలో సంబంధిత ఠాణాలో ఫిర్యాదు చేయకపోవడం విస్మయం కల్గిస్తోంది. శాఖా పరంగా విచారణ జరిపిన అధికారులు వేరో చోట పని చేస్తున్న డీఎస్పీని విచారణకు పంపించి నివేదికలు తెప్పించుకుని.. ఆ తర్వాత ఆయన్ను బాధ్యుడిగా పేర్కొంటూ నిజామాబాద్ డీఎస్పీ వేణుగోపాల్‌ను సస్పెండ్ చేశారు. కానీ, ఈ విషయంలో స్థానిక పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం విడ్డూరంగా మారింది

Related Posts