YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

సాయి ధరమ్ తేజపై కేసు నమోదు

సాయి ధరమ్ తేజపై కేసు నమోదు

హైదరాబాద్
రాయదుర్గం
కేబుల్ బ్రిడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసారు. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద కేసును పోలీసులు నమోదు చేసారు. ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద సాయి ధరమ్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. రాత్రి 8గంటల 5 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సీసీ పుటేజీ రికార్డుల్లో నమోదయినట్లు పోలీసులు తెలిపారు. సీసీ పుటేజీ ఆధారంగా రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో స్పోర్ట్స్ బైక్ను ( ట్రంప్ ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 765 సీసీ ట్రిపుల్ సిలిండర్ ఇంజిన్ తో ఉన్న స్పోర్ట్స్ బైక్ అనిల్ కుమార్ బుర్ర అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయింది. ఇప్పటికే ఓవర్ స్పీడ్ చలాన్ కూడా ఉంది. స్పోర్ట్స్ బైక్స్ అంటే సాయి ధరమ్ తేజ్ కి ఇష్టం. వీకెండ్స్ లో ఫ్రెండ్స్ తో ట్రిప్స్ కి వెళ్ళేవాడు. బైక్ ని సీజ్ చేసి రాయదుర్గం పీఎస్ కి తరలించారు.

Related Posts