YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

టిక్ టాక్‌ దంపతుల ఘరానా మోసం

టిక్ టాక్‌ దంపతుల ఘరానా మోసం

రాజమండ్రి, సెప్టెంబర్ 14, 
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో టిక్‌టాక్‌తో ఫేమస్‌ అయిన దంపతుల ఘరానా మోసం బయటపడింది. మామిడాల శ్రీధర్‌, చెరుకుమిల్లి గాయత్రిలు టిక్ టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యారు. ఈ దంపతులు గోకవరానికి చెందిన గౌరిశంకర్‌ అనే వ్యక్తి కుమార్తెను విదేశాలకు ఉన్నత చదువుల కోసం పంపిస్తామని చెప్పారు. ఆయన దగ్గర రూ.44 లక్షలు వసూలు చేశారు.. ఆ తర్వాత నుంచి ఏవో మాయమాటలు చెబుతూ మాట మార్చారు. ఇవాళ, రేపు అంటూ చెప్పుకుంటూ వచ్చారు.గౌరీ శంకర్‌కు ఈ దంపతులపై అనుమానం వచ్చిన బాధితులు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరారు. దీంతో వీరిద్దరూ తమ మొబైల్స్ స్విచ్చాఫ్‌ చేసుకున్నారు. బాధితులు ఇద్దరు నిందితులపై గోకవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హజరుపర్చినట్లు తెలిపారు. కోర్టు నిందితులకు 15 రోజులపాటు రిమాండ్‌ విధించి. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts