YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

గత 24 గంటల్లో కొత్తగా 35,662 కరోనా పాజిటివ్‌ కేసులు

గత 24 గంటల్లో కొత్తగా 35,662 కరోనా పాజిటివ్‌ కేసులు

గత 24 గంటల్లో కొత్తగా 35,662 కరోనా పాజిటివ్‌ కేసులు
న్యూఢిల్లీ సెప్టెంబర్ 18
దేశంలో కరోనా కేసులు కొద్దిగా పెరిగాయి. శుక్రవారం 34 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, తాజాగా అవి 35 వేలు దాటాయి. దీంతో ఇది నిన్నటికంటే 3.65 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.గత 24 గంటల్లో కొత్తగా 35,662 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,34,17,390కి చేరింది. ఇందులో 3,40,639 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 3,26,32,222 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 33,798 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.ఇక కరోనా వ్యాక్సినేషన్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. దీంతో ఇప్పటివరకు చైనా పేరుతో ఉన్న ఒక్కరోజులో అత్యధిక టీకాలు పంపిణీ చేసిన రికార్డును భారత్‌ తుడిపివేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడించింది.దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 17 వరకు 55,07,80,273 నమూనాలకు పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) తెలిపింది. నిన్న ఒకేరోజు 14,48,833 మందికి పరీక్షలు చేశామని వెల్లడించింది.

Related Posts