YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

కర్ణాటకలో పేలుళ్లు

కర్ణాటకలో పేలుళ్లు

కర్ణాటకలో పేలుళ్లు
బెంగళూర్, సెప్టెంబర్ 23,
కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. చామరాజపేట్ రాయల్ సర్కిల్ పరిధిలోని ఓ ఇంట్లో బాణసంచా పేలిన ఘటనలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు దగ్గరలోని విక్టోరియా హాస్పిటల్‌కు స్థానికులు తరలించారు. ఓ గౌడౌన్‌లో బాణసంచాను తరలిస్తుండగా.. ఈ పేలుడు సంభవించిందని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తెలియజేశారు. సుమారు మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో ఈ పేలుడు జరిగిందని సమాచారం. ఎక్కువగా రద్దీ ఉండే ప్రదేశంలో ఈ పేలుడు జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.ఇదిలా ఉంటే.. పేలుడు తీవ్రతకు డెడ్‌బాడీస్ 100 మీటర్ల దూరానికి ఎగిరి పడటమే కాకుండా.. అక్కడున్న వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. సమాచారం తెలియగానే చామరాజుపేట్ పోలీసులు, వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ సంజీవ్ పటేల్ ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts