YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

24 గంటల్లో 31,923 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

24 గంటల్లో 31,923 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

24 గంటల్లో 31,923 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు
న్యూఢిల్లీ సెప్టెంబర్ 23
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. బుదవారం 27 వేలకుపైగా నమోదైన పాజిటివ్‌ కేసులు తాజాగా 32 వేల చేరువలో నిలిచాయి. కొత్తగా కరోనా బారినపడిన వారిలో 19 వేల మంది ఒక్క కేరళలోనే ఉన్నారు.దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 31,923 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 282 మంది బాధితులు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,63,421కి చేరగా, మరణాలు 4,46,050కి పెరిగాయి. మరో 3,28,15,731 మంది కరోనా నుంచి కోలుకోగా, 3,01,604 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే యాక్టివ్‌ కేసుల సంఖ్య 184 రోజుల దిగువకు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కొత్తగా 31,990 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని తెలిపింది.

Related Posts