YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

తెలుగు అకాడమిలో 43 కోట్ల స్కామ్

తెలుగు అకాడమిలో 43 కోట్ల స్కామ్

తెలుగు అకాడమిలో 43 కోట్ల స్కామ్
హైదరాబాద్, సెప్టెంబర్ 29, 
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. కార్వన్‌లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో నకిలీ పత్రాలు సృష్టించిన కేటుగాళ్లు ఏకంగా రూ.43 కోట్లు కాజేశారు. యూబీఐలో తాము డిపాజిట్‌ చేసిన రూ.43 కోట్లు బ్యాంక్‌లో లేవని అకాడమీ ప్రతినిధులు హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తెలుగు అకాడమీలోని వ్యక్తులే వాటిని విత్‌డ్రా చేసుకున్నారని యూబీఐ ఉన్నతాధికారులు సోమవారం పోలీసులకు తెలిపారు.హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో తెలుగు అకాడమీ దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు తెలుగు అకాడమీలో ఉన్న రూ. 213 కోట్లలో ఆంధ్రప్రదేశ్ వాటా 125 కోట్లు ఇవ్వడానికి అధికారులు సిద్ధమయ్యారు.ఈ నేపథ్యంలోనే తెలుగు అకాడమీకి చెందిన భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా వివిధ బ్యాంక్‌లతో పాటు యూబీఐ కార్వాన్‌, సంతోష్‌నగర్‌ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లున్నాయని తేలింది. దీంతో గడువు తీరకముందే వాటిని విత్‌డ్రా చేయాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఈ నెల 21న డిపాజిట్‌ పత్రాలు బ్యాంకుకు చేరినా అటువైపు నుంచి సమాచారం రాకపోవడంతో 3 రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్‌ నేరుగా బ్యాంకుకు వెళ్లారు. అయితే రూ.43కోట్ల నిధులు ఆగస్టులోనే విత్‌డ్రా అయ్యాయని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో తెలుగు అకాడమీ అధికారులు అవాక్కయ్యారు. దీనిపై విచారణ చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.మరోవైపు ఈ వ్యవహారంపై యూనియన్ బ్యాంక్ అధికారుల వాదన మరోలా ఉంది. ‘అకాడమీ అధికారులు గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది జులై వరకూ రూ.43 కోట్లు డిపాజిట్‌ చేశారు. ఆగస్టులో యూబీఐ శాఖల నుంచి హైదరాబాద్‌లోని రెండు సహకార బ్యాంకుల్లో రూ.11.37 కోట్లు, ఎస్‌బీఐకి రూ.5.70 కోట్లు బదిలీ చేయించారు. మిగిలిన రూ.26 కోట్లు తెలుగు అకాడమీ అధికారులు విత్‌డ్రా చేసుకున్నారు. సరైన అధికారిక పత్రాలు చూపించడంతో నగదు ఇచ్చాం’ అని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వివాద నేపథ్యంలో సొమ్మ విత్‌డ్రా చేయొద్దని సహకార బ్యాంక్‌కి లేఖ రాయగా.. అకాడమీ అకౌంట్లో ప్రస్తుతం రూ.5లక్షలే ఉన్నాయని సమాధానమిచ్చినట్లు యూబీఐ అధికారులు చెబుతున్నారు. బ్యాంక్ లెక్కల ప్రకారం ఆగస్టులో సొమ్మ విత్‌డ్రా కాగా.. తెలుగు అకాడమీ అధికారులు సెప్టెంబర్ 21న విత్‌డ్రా చేయాలని పత్రాలు సమర్పించారు. దీంతో అసలు సొమ్ము ఎవరు విత్‌డ్రా చేశారన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

Related Posts